Monday, 03 August 2026 07:58:17 PM
# నూతన జీఎంను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన ఎఐటీయూసీ నాయకులు. # సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం.

ఓటర్ల వివరాల డిజిటలైజేషన్, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణను వేగవంతం చేయాలి – రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి.

Date : 03 August 2026 06:32 PM Views : 16

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ను పారదర్శకంగా, ఖచ్చితత్వంతో పూర్తి చేయాలి.ఓటర్ల వివరాల డిజిటలైజేషన్, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణను వేగవంతం చేయాలి – రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి.ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం–2026లో భాగంగా చేపడుతున్న ఓటరు జాబితా రూపకల్పనలో పారదర్శకత, ఖచ్చితత్వానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు.సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, సంబంధిత అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు ఐడీఓసీ కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ అంకిత్ హాజరయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా, ఖచ్చితత్వంతో అమలు చేయాలని సూచించారు. ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. డూప్లికేట్ ఎంట్రీలు, ఫోటో మిస్‌మ్యాచ్‌లు, ఏఎస్‌డీ జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి సరిదిద్దాలని చెప్పారు.ఎన్యుమరేషన్ ఫారాల్లో అవసరమైన అన్ని వివరాలను పూర్తిస్థాయిలో నమోదు చేయడంతో పాటు బూత్ లెవల్ అధికారుల (బీఎల్‌వోలు) సంతకాలు తప్పనిసరిగా ఉండేలా చూడాలని సూచించారు. శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన వారు, మరణించిన వారు, గుర్తించలేని ఓటర్ల వివరాలను మరోసారి సమగ్రంగా పరిశీలించి, సంబంధిత జాబితాలపై బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్‌ఏలు) ధృవీకరణ పొందాలని ఆదేశించారు. మ్యాపింగ్ కాని ఓటర్ల వివరాలను వెంటనే పూర్తి చేయాలని సూచించారు.పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో నమోదై ఉంటే వారందరూ ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హుడిని తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసి ఒక్క అర్హుడూ మిగిలిపోకుండా చూడాలని సూచించారు. వీవీఐపీలు, వీఐపీల ఓటరు మ్యాపింగ్‌ను సహాయ ఎన్నికల నమోదు అధికారులు స్వయంగా పరిశీలించి ధృవీకరణ పత్రాలను సమర్పించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ , జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసి, పెండింగ్‌లో ఉన్న ప్రతి దరఖాస్తును నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. డూప్లికేట్ ఎంట్రీలు, ఫోటో మిస్‌మ్యాచ్‌లు, ఏఎస్‌డీ జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా సరిచేయాలని తెలిపారు. శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన వారు, మరణించిన వారు, గుర్తించలేని ఓటర్ల వివరాలను బీఎల్‌వోలు, బీఎల్‌ఏల సమన్వయంతో మరోసారి ధృవీకరించి జాబితాలను నవీకరించాలని ఆదేశించారు.ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల ఓట్లు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణను పకడ్బందీగా చేపట్టాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హుడిని తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసి వంద శాతం నమోదు లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. వీవీఐపీ, వీఐపీ ఓటర్ల మ్యాపింగ్‌ను పూర్తిస్థాయిలో ధృవీకరించాలని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 95 శాతం ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్ పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను కూడా నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో ఎన్నికల సూపర్డెంట్ రంగ ప్రసాద్, ఎన్నికల సిబ్బంది నవీన్ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :