తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ను పారదర్శకంగా, ఖచ్చితత్వంతో పూర్తి చేయాలి.ఓటర్ల వివరాల డిజిటలైజేషన్, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణను వేగవంతం చేయాలి – రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి.ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం–2026లో భాగంగా చేపడుతున్న ఓటరు జాబితా రూపకల్పనలో పారదర్శకత, ఖచ్చితత్వానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు.సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, సంబంధిత అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్కు ఐడీఓసీ కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ అంకిత్ హాజరయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా, ఖచ్చితత్వంతో అమలు చేయాలని సూచించారు. ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. డూప్లికేట్ ఎంట్రీలు, ఫోటో మిస్మ్యాచ్లు, ఏఎస్డీ జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి సరిదిద్దాలని చెప్పారు.ఎన్యుమరేషన్ ఫారాల్లో అవసరమైన అన్ని వివరాలను పూర్తిస్థాయిలో నమోదు చేయడంతో పాటు బూత్ లెవల్ అధికారుల (బీఎల్వోలు) సంతకాలు తప్పనిసరిగా ఉండేలా చూడాలని సూచించారు. శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన వారు, మరణించిన వారు, గుర్తించలేని ఓటర్ల వివరాలను మరోసారి సమగ్రంగా పరిశీలించి, సంబంధిత జాబితాలపై బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏలు) ధృవీకరణ పొందాలని ఆదేశించారు. మ్యాపింగ్ కాని ఓటర్ల వివరాలను వెంటనే పూర్తి చేయాలని సూచించారు.పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో నమోదై ఉంటే వారందరూ ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హుడిని తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసి ఒక్క అర్హుడూ మిగిలిపోకుండా చూడాలని సూచించారు. వీవీఐపీలు, వీఐపీల ఓటరు మ్యాపింగ్ను సహాయ ఎన్నికల నమోదు అధికారులు స్వయంగా పరిశీలించి ధృవీకరణ పత్రాలను సమర్పించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ , జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసి, పెండింగ్లో ఉన్న ప్రతి దరఖాస్తును నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. డూప్లికేట్ ఎంట్రీలు, ఫోటో మిస్మ్యాచ్లు, ఏఎస్డీ జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా సరిచేయాలని తెలిపారు. శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన వారు, మరణించిన వారు, గుర్తించలేని ఓటర్ల వివరాలను బీఎల్వోలు, బీఎల్ఏల సమన్వయంతో మరోసారి ధృవీకరించి జాబితాలను నవీకరించాలని ఆదేశించారు.ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల ఓట్లు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణను పకడ్బందీగా చేపట్టాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హుడిని తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసి వంద శాతం నమోదు లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. వీవీఐపీ, వీఐపీ ఓటర్ల మ్యాపింగ్ను పూర్తిస్థాయిలో ధృవీకరించాలని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 95 శాతం ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను కూడా నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో ఎన్నికల సూపర్డెంట్ రంగ ప్రసాద్, ఎన్నికల సిబ్బంది నవీన్ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ