తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మెగా క్యాంపుకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది అని జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెండు రోజులపాటు నిర్వహించు మెగా ఆధార్ క్యాంపును అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ ప్రారంభించారు. ఆధార్ వివరాల నవీకరణ, చిన్నపిల్లల బయోమెట్రిక్ నమోదు, చిరునామా మార్పులు, మొబైల్ నెంబర్ అనుసంధానం వంటి సేవలు ఒకే చోట అందుబాటులో ఉండటంతో పెద్ద ఎత్తున ప్రజలు మెగా ఆధార్ క్యాంపుకు విచ్చేసి సేవలను సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున మెగా ఆధార్ క్యాంపు కు ప్రజలు తరలివచ్చారని, వారికి అనుగుణంగా కావలసిన ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రస్థాయి బృంద సభ్యులు ఆదార్ సమస్యలపై తగిన పరిష్కారాలు చూపించారన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, వారి సౌకర్యార్థం ప్రతి మండల కేంద్రంలో ఆధార్ క్యాంపును నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. పెద్ద ఎత్తున ప్రజలు ఆధార్ నవీకరణ మరియు సవరణకు వస్తున్నందువలన ప్రతి మండలంలో షెడ్యూల్ వారిగా ఆధార్ క్యాంపులుప్రజలకు మరింత సౌకర్యంగా ఉండేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు.జిల్లాలోని 23 మండలాల్లో వేర్వేరు తేదీల్లో ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూలై 10, 11 తేదీలలో : కొత్తగూడెం, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్, జులూరు పాడు, చండ్రుగొండ మండలాలకు కలెక్టర్ కార్యాలయంలోని నవభారత్ హాలులో ఆధార్ సేవలు అందించనున్నారు. జూలై 14, 15, 16 తేదీలలో : భద్రాచలం, బుర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం మండలాలకు భద్రాచలం ఆర్డీఓ కార్యాలయంలో,యెల్లందు, టెకులపల్లి, అల్లాపల్లి, గుండాల మండలాలకు యెల్లందు మున్సిపల్ కార్యాలయంలో క్యాంపులు జరుగుతాయి. జూలై 15, 16, 17 తేదీలలో : దమ్మపేట ఎంపీడీఓ కార్యాలయంలో దమ్మపేట, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి మరియు ఆస్వారాపేట మండలాలకు,మణుగూరు ఎంపీడీఓ కార్యాలయంలో మణుగూరు, ఆస్వాపురం, పినపాక మరియు కారకగూడెం మండలాలకు క్యాంపులు నిర్వహించనున్నారు.ప్రతి కేంద్రంలో అవసరానికి తగిన విధంగా ఆధార్ కిట్లు అందుబాటులో ఉంచి వేగవంతంగా సేవలు అందించేలా అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలో ప్రజలు ఆధార్ సమస్యలను పరిష్కరించుకునే వరకు నిరంతరంగా ఆధార్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ రీజియన్ యు ఐ డి ఐ అసిస్టెంట్ మేనేజర్ మహమ్మద్ సౌభన్, జిల్లా ఈ డిస్టిక్ మేనేజర్ సైదేశ్వర రావు మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ