తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం.విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో నాలుగు దశాబ్దాల పాటు విశిష్ట సేవలందించిన స్కూల్ అసిస్టెంట్ (గణితం) రామిశెట్టి శ్రీనివాసరావు పదవీ విరమణ సన్మానోత్సవం ఈరోజు జూలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.సుమారు 40 సంవత్సరాలపాటు విద్యాశాఖలో ఉపాధ్యాయునిగా సేవలందించిన శ్రీనివాసరావు వందలాది మంది విద్యార్థులకు గణిత బోధనతో పాటు క్రమశిక్షణ, విలువలు, ఉన్నత లక్ష్యాలను అలవర్చడంలో విశేష కృషి చేశారు. వారి సేవలను కొనియాడుతూ పాఠశాల కుటుంబం ఘనంగా సన్మానించింది.పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి. లక్ష్మీనరసయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, మాజీ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ, రామిశెట్టి శ్రీనివాసరావు ఉపాధ్యాయ వృత్తికి ఆదర్శంగా నిలిచారని, వారి సేవలు విద్యార్థులు మరియు సమాజానికి చిరస్మరణీయమని కొనియాడారు. అనంతరం ఆయనను శాలువా, పుష్పగుచ్ఛాలతో సత్కరించి జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించారు.కార్యక్రమం లో కార్యక్రమంలో సురపనేని శాంత కుమారి పాఠశాల సీనియర్ ఉపాధ్యాయురాలు, నండ్రు గురుమూర్తి, పి రామనాథం జి వెంకటేశ్వర్లు ఉమామహేశ్వరి, శకుంతల, సునీత, అరుణ, లలిత, పటేల్, కృష్ణ, జివిఆర్ ప్రసాద్, ప్రతాపరెడ్డి, వై శ్రీకాంత్ రెడ్డి, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ