Thursday, 17 September 2026 04:43:15 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం.

Date : 31 July 2026 08:24 PM Views : 700

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం.విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో నాలుగు దశాబ్దాల పాటు విశిష్ట సేవలందించిన స్కూల్ అసిస్టెంట్ (గణితం) రామిశెట్టి శ్రీనివాసరావు పదవీ విరమణ సన్మానోత్సవం ఈరోజు జూలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.సుమారు 40 సంవత్సరాలపాటు విద్యాశాఖలో ఉపాధ్యాయునిగా సేవలందించిన శ్రీనివాసరావు వందలాది మంది విద్యార్థులకు గణిత బోధనతో పాటు క్రమశిక్షణ, విలువలు, ఉన్నత లక్ష్యాలను అలవర్చడంలో విశేష కృషి చేశారు. వారి సేవలను కొనియాడుతూ పాఠశాల కుటుంబం ఘనంగా సన్మానించింది.పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి. లక్ష్మీనరసయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, మాజీ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ, రామిశెట్టి శ్రీనివాసరావు ఉపాధ్యాయ వృత్తికి ఆదర్శంగా నిలిచారని, వారి సేవలు విద్యార్థులు మరియు సమాజానికి చిరస్మరణీయమని కొనియాడారు. అనంతరం ఆయనను శాలువా, పుష్పగుచ్ఛాలతో సత్కరించి జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించారు.కార్యక్రమం లో కార్యక్రమంలో సురపనేని శాంత కుమారి పాఠశాల సీనియర్ ఉపాధ్యాయురాలు, నండ్రు గురుమూర్తి, పి రామనాథం జి వెంకటేశ్వర్లు ఉమామహేశ్వరి, శకుంతల, సునీత, అరుణ, లలిత, పటేల్, కృష్ణ, జివిఆర్ ప్రసాద్, ప్రతాపరెడ్డి, వై శ్రీకాంత్ రెడ్డి, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :