తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : • జూలై 23 2027 నుండి ప్రారంభం కానున్న పుష్కర ఏర్పాట్లపై సమీక్ష • భద్రాచలం రామాలయం మాడ వీధుల విస్తరణ ఆగమ శాస్త్రం ప్రకారం జరగాలి • దశల వారీగా మూడు ఏళ్ళలో విస్తరణ పనులు పూర్తి చేయాలి • సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన • కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు • దేవాదాయ శాఖ కమీషనర్ కు మంత్రి తుమ్మల దిశానిర్దేశం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రామయ్య ఆలయం నూతన శోభ సంతరించుకొనుంది. మార్చి 2026 లో శ్రీరామనవమి సీతారామ కళ్యాణం నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమీక్షించారు. భద్రాద్రి రామయ్య అభివృద్ధి పనులకు ఆటంకంగా ఉన్న భూ సేకరణకు కాంగ్రెస్ సర్కారు ముఖ్యమంత్రి ఆదేశాలతో రూ. 34 కోట్లు విడుదల చేయడం తో భూ సేకరణ పూర్తి చేయడం జరిగింది. ఆలయం విస్తరణ పనులు కోసం భూ సేకరణ పూర్తవడంతో ఆలయం మాడ వీధుల విస్తరణ పనులు, ప్రాకార నిర్మాణాలు చేపట్టాలని,ఆగమ శాస్త్రం ప్రకారం ఆర్కిటెక్ట్ ఇచ్చిన డిజైన్లు (మాస్టర్ ప్లాన్) ముఖ్య మంత్రి ఆమోదం తో ఫైనల్ చేసి పనులు మొదలు పెట్టాలని మంత్రి తుమ్మల సూచించారు. దీంతో దక్షిణ అయోధ్య టెంపుల్ సిటీకి అడుగులు పడనున్నాయి. భద్రాచలం రామాలయం మాడ వీధుల విస్తరణ పనులు ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మాణం చేయాలని మంత్రి తుమ్మల తెలిపారు. బుధవారం నాడు హైదరాబాద్ సచివాలయం లో దేవాదాయ శాఖ కమీషనర్ హరీష్ తో ఆలయ విస్తరణ పనులు పై మంత్రి తుమ్మల చర్చించారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ దక్షిణ అయోధ్య గా భాసిల్లుతున్న భద్రాచలం రామాలయం 1664 లో భక్త రామదాసు నిర్మాణం చేశారు. పెరుగుతున్న భక్తుల సౌకర్యం కోసం ఆలయం విస్తరణ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రామాలయం మాడ వీధుల విస్తరణ పనులు దశల వారీగా మూడు ఏళ్ళలో పూర్తి చేయాలని దేవాదాయ శాఖ కమీషనర్ హరీష్ కు మంత్రి తుమ్మల దిశా నిర్దేశం చేశారు. మంత్రి తుమ్మల చొరవతో సీఎం రేవంత్ రెడ్డి భూసేకరణకు కావలసిన నిధులను విడుదల చేసి ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. భారతదేశానికి తలమానికంగా దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. అనేక ఏళ్లుగా పెండింగ్లో ఉన్న భూసేకరణ సమస్యకు ఎట్టకేలకు మంత్రి తుమ్మల పరిష్కారం చూపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నవ భద్రాద్రి దిశగా తుమ్మల కృషి చేస్తున్నారు. భూ సేకరణ తరువాయి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. దక్షిణ అయోధ్యగా భద్రాద్రి ఆలయ కీర్తి ధ్వనించేలా అభివృద్ధి చేయనున్నారు. నమూనాలు సిద్ధం... శ్రీరామచంద్రుడి ఆలయ అభివృద్ధికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యవేక్షణలో భద్రాద్రి ఆలయం నూతన శోభ సంతరించుకొనుంది. ఆగమ పండితులు రూపొందించిన నమూనాల ప్రకారం అభివృద్ధి పనులను ప్రారంభించేలా మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. మాస్టర్ ప్లాన్ నమూనాల ప్రకారం అత్యద్భుతంగా భద్రాద్రి ఆలయ పునర్నిర్మాణానికి అడుగులు పడనున్నాయి. గోదావరి పుష్కరాలు కుంభ మేళా మాదిరి ఏర్పాట్లు: వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్ల పై దేవాదాయ శాఖ కమీషనర్ తో చర్చించారు. పుష్కర ఏర్పాట్లపై అన్నీ శాఖలతో సన్నాహక సమావేశం నిర్వహించాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. కుంభమేళా తరహాలో భద్రాచలం లో పుష్కరాల ఏర్పాట్లు చేయాలని మంత్రి తుమ్మల సూచించారు. దక్షిణ అయోధ్య గా భాసిల్లుతున్న భద్రాచలం రామాలయం దర్శనానికి మరియు గోదావరి నదిలో పుష్కర స్నానానికి లక్షలాది మంది భక్తులు వస్తారని ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్నానాల ఘాట్లు ఏర్పాటు చేయాలని వసతి కేంద్రాలు, మెడికల్ క్యాంప్ లు శానిటేషన్, తాగునీరు, రవాణా సౌకర్యాలు భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలన్నారు. శానిటేషన్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుని పుష్కరాల ఏర్పాట్లు చేయాలని మంత్రి తుమ్మల దిశా నిర్దేశం చేశారు. 2003 లో 2015 లో గోదావరి పుష్కరాలు సమయంలో మంత్రిగా ఉన్న తుమ్మల అప్పటి అనుభవాలను గుర్తు చేసారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన ముందస్తు ప్రణాళికలు పై ఎండోమెంట్ కమీషనర్ కు మంత్రి తుమ్మల తన అనుభవాలు వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరగనున్న గోదావరి పుష్కరాల నిర్వహణ ప్రభుత్వ ప్రతిష్ట పెంచేలా ఉండాలని కోట్లాది మంది భక్తులు మెచ్చేలా పుష్కరాల ఏర్పాట్లు చేయాలని ఎండోమెంట్ కమీషనర్ హరీష్ కు మంత్రి తుమ్మల ప్రభుత్వ విధానం వివరించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ