తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణంలోని న్యూ బిగ్ బజార్ సూపర్ మార్కెట్ ను జిల్లా ఎస్పీ రోహిత రాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజురోజుకు అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తున్న కొత్తగూడెం పట్టణంలో సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా మెగా సూపర్ మార్కెట్ గా బిగ్ బజార్ ను నెలకొల్పడం అభినందనీయమన్నారు. అభివృద్ధిలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా హైదరాబాద్ లాంటి మహానగరాలకు దీటుగా వ్యాపార సంస్థలు కొత్తగూడెంలో నెలకొల్పడం చూస్తుంటే జిల్లా కేంద్రం ఎంతగా అభివృద్ధి చెందిందో స్పష్టంగా అర్థమవుతుందని తెలిపారు. న్యూ బిగ్ బజార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న టిపిసిసి రాష్ట్ర జనరల్ సెక్రెటరీ నాగ సీతారాములు, సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి Sk సాబీర్ పాషా, మాజీ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ కంచర్ల చంద్రశేఖర్,JVS చౌదరి, వాసిరెడ్డి మురళి తదితరులు వ్యాపారస్తులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ