Thursday, 17 September 2026 08:16:07 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

ఆధునిక వ్యవసాయ పద్ధతులతో అధిక దిగుబడులు సాధించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 23 March 2026 04:32 PM Views : 265

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించి పంటల దిగుబడులను గణనీయంగా పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ పిలుపునిచ్చారు. సోమవారం రామవరం కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్ మేళా మరియు వ్యవసాయ ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గాలికుంట వ్యాధి నివారణకు సంబంధించి నిర్వహిస్తున్న జాతీయ ఉచిత టీకాల కార్యక్రమంపై అవగాహన కల్పించే గోడపత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం జెండా ఊపి టీకాల కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. కిసాన్ మేళా సందర్భంగా వ్యవసాయం, కృషి విజ్ఞాన కేంద్రం, పశుసంవర్ధక రంగాలకు సంబంధించిన వివిధ స్టాళ్లను కలెక్టర్ ప్రారంభించి సమగ్రంగా పరిశీలించారు. రైతులకు అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పద్ధతులు, నాణ్యమైన విత్తనాల వినియోగం, పంటల నిర్వహణ విధానాలు, వ్యవసాయ యంత్రాల వినియోగం, పంట రక్షణ చర్యలు, నీటి సంరక్షణ పద్ధతులపై ఏర్పాటు చేసిన ప్రదర్శనలను ఆసక్తిగా వీక్షించారు. ఈ సందర్భంగా రైతులతో ప్రత్యక్షంగా ముచ్చటించి వారి సమస్యలను తెలుసుకుని, సంబంధిత అధికారులకు తగిన సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలు, వడగళ్ల వానలు వంటి సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రైతులు శాస్త్రీయ మరియు ఆధునిక పద్ధతులను అనుసరించడం అత్యవసరమని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో జరుగుతున్న సాంకేతిక మార్పులను రైతులు స్వీకరించి, ఆధునిక విధానాల ద్వారా ఖర్చులను తగ్గిస్తూ దిగుబడులను పెంచుకోవచ్చని సూచించారు. కృషి విజ్ఞాన కేంద్రం అందిస్తున్న శిక్షణలు, శాస్త్రవేత్తల సలహాలు, ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పంట మార్పిడి విధానాలను అమలు చేయడం ద్వారా నేల సారాన్ని కాపాడుకోవడంతో పాటు పంటల ఉత్పత్తి పెరుగుతుందని తెలిపారు. అదేవిధంగా సంప్రదాయ వ్యవసాయంతో పాటు వాణిజ్య పంటల సాగు, మిశ్రమ పంటల విధానం, పశుసంవర్ధక రంగాన్ని అనుసంధానం చేసుకోవడం ద్వారా రైతుల ఆదాయం పెంపొందించుకోవచ్చని వివరించారు. ప్రజా పాలన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ కిసాన్ మేళా నిర్వహించబడిందని, రైతులకు ఒకే వేదికపై ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ మేళా ద్వారా రైతులు కొత్త పద్ధతులను నేర్చుకుని వాటిని తమ పొలాల్లో అమలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గణేష్, డిప్యూటీ మేయర్ సిరిపురం లలిత, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, ఉద్యానవన శాఖ అధికారి కిషోర్, మత్స్య శాఖ అధికారి ఇంతియాజ్ ఖాన్, త్రీ ఇంక్లైన్ సర్పంచ్ ఈసం ప్రవల్లిక, కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ భరత్, ఆత్మ చైర్మన్లు వీరభద్ర రావు, బుచ్చిబాబు, బోడా మంగీలాల్, శాస్త్రవేత్తలు, తహసీల్దార్, ఎంపీడీవో, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :