Sunday, 07 June 2026 08:46:34 AM
# బిజెపి పార్టీ సీనియర్ నాయకులు సొప్పరి క్రాంతి ఆధ్వర్యంలో గౌతంపూర్ లో మొక్కలు నాటడం జరిగినది. # ఈ నెల 7, 8 తేదీల్లో రెండు రోజులపాటు ఎఐటీయూసీ సెంట్రల్ కౌన్సిల్ సమావేశం. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి. # మున్సిపల్ కార్పొరేషన్‌లో సిపిఐ పక్ష బలాన్ని సమర్థవంతంగా చాటాలి.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు # నామా వినోద్‌పై దాడి చేసిన భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. # మీసేవ దరఖాస్తుల పరిశీలన పూర్తిగా ఆన్‌లైన్‌లోనే. జీపీఓలు, ఆర్‌ఐలకు అవగాహన కల్పించిన ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు. # ప్రజల ప్రాణ రక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలి. గోదావరి వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మరో రెండు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్న నేపథ్యంలో జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి. # భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప కాలనీ, రెవిన్యూ కాలనీల్లో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్. # విద్యార్థులు సాంస్కృతిక పోటీల్లో రాణించాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పెట్రోలింగ్,బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మాస్టర్ ఈ .కె ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కాకర్ల గ్రామం నందు ఉచిత హోమియో వైద్య శిబిరం. # భూభారతి, సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ పార్కులో ప్లాస్టిక్ ఏరివేత -మొక్కలు నాటిన ఎస్ జి ఎఫ్. # కొత్తగూడెం ఇల్లందు రహదారిపై స్కూటీని ఢీకొన్న లారీ. # పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ధరల పెరుగుదలపై రాజీలేని పోరాటం చేద్దాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # గోపన్నగూడెంలో మినీ మేడారం జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె. # జనగణన జాబితా వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # సమున్నత ఆశయాలతోనే భారత జాతీయ మహిళా సమాఖ్య ఆవిర్భావం. భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి. # ప్రజా సమస్యల పరిష్కార మార్గాన్ని చూపే విధంగా గ్రామ సభలు ఉండాలి. 16వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

ఆధునిక వ్యవసాయ పద్ధతులతో అధిక దిగుబడులు సాధించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 23 March 2026 04:32 PM Views : 170

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించి పంటల దిగుబడులను గణనీయంగా పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ పిలుపునిచ్చారు. సోమవారం రామవరం కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్ మేళా మరియు వ్యవసాయ ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గాలికుంట వ్యాధి నివారణకు సంబంధించి నిర్వహిస్తున్న జాతీయ ఉచిత టీకాల కార్యక్రమంపై అవగాహన కల్పించే గోడపత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం జెండా ఊపి టీకాల కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. కిసాన్ మేళా సందర్భంగా వ్యవసాయం, కృషి విజ్ఞాన కేంద్రం, పశుసంవర్ధక రంగాలకు సంబంధించిన వివిధ స్టాళ్లను కలెక్టర్ ప్రారంభించి సమగ్రంగా పరిశీలించారు. రైతులకు అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పద్ధతులు, నాణ్యమైన విత్తనాల వినియోగం, పంటల నిర్వహణ విధానాలు, వ్యవసాయ యంత్రాల వినియోగం, పంట రక్షణ చర్యలు, నీటి సంరక్షణ పద్ధతులపై ఏర్పాటు చేసిన ప్రదర్శనలను ఆసక్తిగా వీక్షించారు. ఈ సందర్భంగా రైతులతో ప్రత్యక్షంగా ముచ్చటించి వారి సమస్యలను తెలుసుకుని, సంబంధిత అధికారులకు తగిన సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలు, వడగళ్ల వానలు వంటి సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రైతులు శాస్త్రీయ మరియు ఆధునిక పద్ధతులను అనుసరించడం అత్యవసరమని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో జరుగుతున్న సాంకేతిక మార్పులను రైతులు స్వీకరించి, ఆధునిక విధానాల ద్వారా ఖర్చులను తగ్గిస్తూ దిగుబడులను పెంచుకోవచ్చని సూచించారు. కృషి విజ్ఞాన కేంద్రం అందిస్తున్న శిక్షణలు, శాస్త్రవేత్తల సలహాలు, ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పంట మార్పిడి విధానాలను అమలు చేయడం ద్వారా నేల సారాన్ని కాపాడుకోవడంతో పాటు పంటల ఉత్పత్తి పెరుగుతుందని తెలిపారు. అదేవిధంగా సంప్రదాయ వ్యవసాయంతో పాటు వాణిజ్య పంటల సాగు, మిశ్రమ పంటల విధానం, పశుసంవర్ధక రంగాన్ని అనుసంధానం చేసుకోవడం ద్వారా రైతుల ఆదాయం పెంపొందించుకోవచ్చని వివరించారు. ప్రజా పాలన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ కిసాన్ మేళా నిర్వహించబడిందని, రైతులకు ఒకే వేదికపై ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ మేళా ద్వారా రైతులు కొత్త పద్ధతులను నేర్చుకుని వాటిని తమ పొలాల్లో అమలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గణేష్, డిప్యూటీ మేయర్ సిరిపురం లలిత, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, ఉద్యానవన శాఖ అధికారి కిషోర్, మత్స్య శాఖ అధికారి ఇంతియాజ్ ఖాన్, త్రీ ఇంక్లైన్ సర్పంచ్ ఈసం ప్రవల్లిక, కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ భరత్, ఆత్మ చైర్మన్లు వీరభద్ర రావు, బుచ్చిబాబు, బోడా మంగీలాల్, శాస్త్రవేత్తలు, తహసీల్దార్, ఎంపీడీవో, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :