తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : ఓ మహిళా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్పై జూలూరుపాడు మండలం పాపకొల్లు బీట్ పరిధిలోని రాసగాని గుట్ట అటవీ ప్రాంతంలో దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీట్ ఆఫీసర్ విజయలక్ష్మి పోడు భూముల పరిశీలన కోసం వెళ్లగా, ఓ మహిళ ఆమెపై దాడి చేసింది. ఈ ఘటనపై బీట్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోడు భూముల సమస్యపై అధికారులు, గిరిజనుల మధ్య వివాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే.
Admin
తెలుగు వెలుగు టీవీ