తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 7 తెలుగు వెలుగు ) : వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలల్లో ఈ గీతాన్ని సామూహికంగా ఆలపించమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలలో భాగంగా శుక్రవారం జూలూరుపాడు మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో సిబ్బందితో వందేమాతరం గీతాన్ని సామూహికంగా ఆలపించారు. ఎంపీవో తులసీరామ్ సూపర్డెంట్ రవి లు మాట్లాడుతూ వందేమాతరం గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించినట్లు తెలిపారు. ఈ క్రమంలో నవంబరు 7న ఉదయం 10 గంటలకు దేశవ్యాప్తంగా అందరూ ఒక నిర్ణీత సమయంలో వందేమాతరం గేయం ఆలపించటం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయ సిబ్బందంతా ఉత్సాహంగా పాల్గొని దేశభక్తిని ప్రదర్శించారుఅని “వందేమాతరం” గీతం మన జాతీయ చైతన్యానికి ప్రతీకగా, స్వాతంత్ర్య సమర యోధులకు ప్రేరణగా నిలిచినదని ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ