Monday, 03 August 2026 03:37:22 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ ఉద్యోగులకు కూడా రూ.1 కోటి ప్రమాద బీమా వర్తింపు

Date : 23 July 2026 05:17 PM Views : 461

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ ఉద్యోగులకు కూడా రూ.1 కోటి ప్రమాద బీమా వర్తింపు – ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య,ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ వెల్లడి. సింగరేణి సంస్థ పరిధిలోని సింగరేణి ఎడికేషనల్ సొసైటీలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా కార్పొరేట్ సాలరీ అకౌంట్ ద్వారా అందించే రూ.1 కోటి ప్రమాద బీమా (యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్) వర్తించేలా సంబంధిత బ్యాంకులు అంగీకరించినట్లు ఏఐటీయూసీ సింగరేణి వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.వారు మాట్లాడుతూ, కార్పొరేట్ సాలరీ అకౌంట్ కలిగిన ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణించిన పక్షంలో సంబంధిత నిబంధనల ప్రకారం అతని కుటుంబానికి రూ.1 కోటి ప్రమాద బీమా ప్రయోజనం అందే విధంగా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం సింగరేణి స్కూల్ ఎడికేషనల్ సొసైటీలో ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు వారి కుటుంబాలకు ఎంతో ఉపశమనం కలిగిస్తుందని తెలిపారు.అదేవిధంగా, సింగరేణి సూపర్ బజార్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ఇదే తరహా రూ.1 కోటి ప్రమాద బీమా సౌకర్యం వర్తించేలా గుర్తింపు సంఘం ఏఐటీయూసీ యాజమాన్యం మరియు సంబంధిత బ్యాంకులతో చర్చలు జరుపుతూ నిరంతరం కృషి చేస్తోందని వెల్లడించారు.సింగరేణి సంస్థ పరిధిలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి సమాన సంక్షేమ సౌకర్యాలు, భద్రతా పరిరక్షణ మరియు ఆర్థిక రక్షణ కల్పించడమే ఏఐటీయూసీ లక్ష్యమని వారు స్పష్టం చేశారు. ఉద్యోగుల హక్కులు, భద్రత మరియు సంక్షేమం కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :