Wednesday, 16 September 2026 06:06:36 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

నిర్దేశించిన లక్ష్యం మేరకు ప్రాధాన్యత రంగాలకు బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

Date : 19 September 2024 08:00 PM Views : 547

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గురువారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఐ డి ఓ సి మినీ సమావేశ మందిరంలో వివిధ బ్యాంకులకు చెందిన అధికారులతో, జిల్లాస్థాయి అధికారులతోసమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రాధాన్యతా రంగాలను పరిగణలోకి తీసుకొని రుణాలు మంజూరు చేయాలని, వ్యవసాయ రంగ అభివృద్ధికి రుణాలు ఎంతో ముఖ్యమని చెప్పారు. రుణాల మంజూరు తో రైతులు ఆధునిక వ్యవసాయ పరికరాలు కొనుగోలు, వినియోగంతో అధిక ఉత్పత్తిని సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. అంతర్జాల సేవలు అందుబాటు లేని కారణంగా ప్రజలు పౌర సేవలతోపాటు మారుమూల గ్రామాలలో బ్యాంకింగ్ సేవలు పొందడానికి ఆటంకం కలుగుతుందని బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్ సంస్థల అధికారులతో సమావేశం నిర్వహించుటకు కార్యచరణ తయారు చేయాలని తెలిపారు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకంలో బ్యాంకులు ఖాతాలు ప్రారంభించడానికి అన్ని బ్యాంకులకు లక్ష్యాలు కేటాయించాలని ఎల్ డి ఎం కు సూచించారు.ఐ టి డి ఏ ద్వారా పెండింగ్ లో ఉన్న యూనిట్లపై మంజూరుకు చర్యలు చేపట్టడంతో పాటు నివేదికలు అందజేయాలని చెప్పారు. మత్స్యకారులకు రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. మండల స్థాయి వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించి రుణాలు మంజూరు చేయించాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలం చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామంలో గిరిజన రైతులు బ్యాంకు రుణం ద్వారా మూడు కోట్ల వ్యయంతో కోల్డ్ స్టోరేజ్ స్థాపించుకున్నారని, దానిని మార్గదర్శకంగా తీసుకుని జిల్లాలోని రైతులు బ్యాంకు రుణాల సహాయంతో మరిన్ని కోల్డ్ స్టోరేజ్ లు నిర్మించుకోవాలని సూచించారు. జిల్లాలోని 23 రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైదరాబాదు నుండి ప్రతి మంగళవారం వ్యవసాయ అధికారులు మరియు శాస్త్రవేత్తలు రైతులకు సలహాలు సూచనలు ఇస్తున్నారని,ఆ సందర్భంలోఅన్ని బ్యాంకులు రుణమేళాలు, రెన్యువల్సు నిర్వహించాలని,రైతులకు నూతన వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతులు వ్యవసాయానికి ఈ ఆధునిక కాలంలో కూడా ఎద్దులను వాడుతున్నారని, వాటి ఖరీదులో మినీ ట్రాక్టర్స్, వాడుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించి రుణాలు మంజూరు చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, పశుసంవర్ధక శాఖ అధికారి పురందరేశ్వర్, ఎస్సీఈడీ కార్పొరేషన్ సంజీవరావు, ఆర్బిఐ నుంచి పృద్వి, చీఫ్ మేనేజర్ లోన్స్ శ్రీ నివాస్, ఏపీ ఏపీజీవీబీ ఆర్ ఎం, ఎం ఉదయ్, ఐటీడీఏ ఎస్ ఓ వివిఎన్ భాస్కరరావు, అన్ని బ్యాంకుల కంట్రోలర్లు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :