తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనవరి 15 తెలుగు వెలుగు)జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు(ఎన్టీర్) విగ్రహాన్ని ఆవిష్కరించిన వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బక్కిని నరసింహులు, తిరుమల తిరుపతి దేవస్థానం మెంబర్ నన్నూరి నర్సిరెడ్డి .ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ఎన్టీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు మహాశక్తిని దేశ రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. నన్నూరి నర్సిరెడ్డి మాట్లాడుతూ... మనందరి ఆరాధ్య దైవం పేదవాడి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించి తెలుగు వాడి ఆత్మ గౌరవం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని అటువంటి గొప్ప వ్యక్తి విగ్రహావిష్కరణకు తాను హాజరు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. నందమూరి తారక రామారావు ఒక నటుడిగానే కాకుండా రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చి పేదవాడి సంతోషం కోసం అనేక రకాల సంక్షేమ పథకాలను అందించిన మహా వ్యక్తిని కొనియాడారు. కోట్లాది రూపాయల ఆస్తులు కూడగట్టిన పేదవాడి సంతోషం కోసం తను ప్రతిరోజు ఆలోచిస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జీవించారని నందమూరి తారక రామారావు భౌతికంగా మన మధ్య లేకపోయినా అతను ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చేసిన సేవా కార్యక్రమాల ద్వారా ఇప్పటికీ ఎప్పటికీ ప్రజల మనసుల్లో జీవించి ఉంటారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు , మరియు జిల్లా కాంగ్రెస్ నాయకులు లేళ్ల వెంకటరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాలోత్ మంగీలాల్, మరియు అభిమానులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ