Thursday, 02 July 2026 05:25:35 AM
# సింగరేణి గడ్డ మరోసారి పోరాటాల గడ్డగా మారింది. జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడి విజయవంతం.వేలాది కార్మికులతో మార్మోగిన డిమాండ్ల డే. # నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం తగదు.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాలు పేద కుటుంబాలకు కొండంత అండ. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకం ప్రయోజనాలు పారదర్శకంగా అందిస్తాం: జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి సన్మానం. # కార్మికుల న్యాయమైన వేతన హక్కులను కాలరాయొద్దు – 12వ వేతన కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి. # వట్టికొండ రజిని జయంతి సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులు, బట్టల పంపిణీ. # నూతన జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని గడువులోపు పూర్తి చేయాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్ రెడ్డి. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశీలక బృందం సందర్శించింది. # ప్రజలకు నిర్విరామంగా సేవలందించిన ఉద్యోగుల సేవలు చిరస్మరణీయం: జిల్లా కలెక్టర్ అంకిత్. # ఓటర్ల జాబితా సవరణలో బిఎల్ఏల పాత్ర కీలకం. బిఎల్ఏల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం.అరెస్టు చేసిన కూనంనేనిని, ఇతర నేతలను భేషరతుగా విడుదల చేయాలి. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం. సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఇండ్లు లేని పేదల పక్షాన సమిష్టిగా పోరాడుదాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు. # మొహరం పండుగ త్యాగానికి, సేవకు నిదర్శనం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # తల్లిదండ్రుల మందలించడంతో మనస్తాపం చెంది కొడుకు ఆత్మహత్య. # పద్ధతి మార్చుకోండి లేదంటే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు రౌడీషీటర్లకు డీఎస్పీ అరుణ్ కుమార్ కౌన్సిలింగ్. # ​ బైక్ అదుపుతప్పి కరెంట్ పోల్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో సమ్మయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి. # ప్రాచీన సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకుందాం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

కాటమయ్య రక్షణ కవచాల పంపిణీ.

Date : 19 October 2024 08:00 PM Views : 519

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కాటమయ్య రక్షణ కవచాలను పంపిణీ చేసిన ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి మరియు పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్,అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆది నారాయణ మరియు భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు తో కలిసి పంపిణీ చేశారు. శనివారం ఇల్లందు క్రాస్ రోడ్ లోగల సింగరేణి గెస్ట్ హౌస్ లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గౌడ్ అన్నలకు రక్షణ కవచాలను పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం పార్లమెంటు రామ సహాయం రఘురాం రెడ్డి మాట్లాడుతూ గీత కార్మికుల రక్షణకు ప్రభుత్వం కాటమయ్య రక్షణ కవచాల కిట్లు గౌడ్ అన్నలకు ఉచితంగా పంపిణీ చేస్తుందన్నారు. గౌడ్ అన్నలు తమ వృత్తిలో భాగంగా తాటి చెట్లు ఎక్కుతున్న క్రమంలో ఆకస్మికంగా జరిగే ప్రమాదాల వలన చాలామంది మరణానికి, శాశ్వత అంగవైకల్యానికి గురి అవుతున్న క్రమంలో వాటిని అరికట్టడానికి ప్రభుత్వం గౌడ్ అన్నల భద్రత కోసం ప్రత్యేక దృష్టి సాధించి వారికోసం ప్రత్యేకంగా ఒక కిట్ తయారు చేయించి దానిని గౌడ్ అన్నల కులదైవం అయినటువంటి కాటమయ్య పేరు పెట్టి కాటమయ్య రక్షగా ఒక పథకం ద్వారా అందరికీ ఆ కిట్లను అందజేస్తుందన్నారు. దీనిలో భాగంగా గీత కార్మికులకు దశలవారుగా శిక్షణ ఇచ్చి, అందరికీ అందే విధంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు.

మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూరక్షక కవచం కిట్ల వల్ల కల్లు గీత కార్మికులు చెట్లపైకి వెళ్లినప్పుడు ప్రమాదాల బారిన పడకుండా ఉంటారని, వీటిని ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని, దీనిని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కల్లుగీత కార్మిక సొసైటీ పరిధిలోని చెట్లపైకి ఎక్కే గీత కార్మికులందరినీ గుర్తించి వారికి రక్షక కవచ కిట్లను అందజేస్తామని తెలిపారు. కాటమయ్య రక్షక కవచం కిట్లను అందజేసిన గీత కార్మికులు వాటిని వినియోగిస్తున్నారా లేదా చూడాలని, ఈ కిట్ల వినియోగం వల్ల కలిగే లాభాలను ఎక్సైజ్ అధికారులు విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో గీత కార్మికుల రక్షణ కోసం కాటమయ్య రక్షణ కవచాలు కంపెనీ కార్యక్రమం చేపట్టడంచాలా సంతోషం కరమని అన్నారు.జిల్లా లో ని రెండు పార్లమెంట్ నియోజకవర్గలా ఖమ్మం, భద్రాచలం పరిధిలో ఈరోజు 83 మందికి కాటమయ్య రక్షణ కవచాల పంపిణీ చేపడుతున్నామన్నారు. గీత కార్మికులకు రక్షణ కోసంకోసం ప్రభుత్వం 12,000 ఖర్చు చేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి ఇందిర, మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :