తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : యూరియా బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలి యూరియా కొరతపై దర్యాప్తు చేయించాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సరిపడా యూరియా సరఫరా చేస్తున్నామని చెబుతుంటే కొరతకు కారణాలేంటో ప్రభుత్వం ఆరా తీయాలన్నారు.కొంతమంది సహకార సంఘాల నాయకులు ఎన్నో ఏళ్ళుగా ఏపార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉంటూ దళారీ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని రైతులకు అందించాల్సిన యూరియా ను అక్రమంగా వ్యాపారులకు అమ్ముకుంటూ లక్షల రూపాయలు గడిస్తున్నారని,దీనిపై సమగ్ర విచారణ జరిపించి యూరియా బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలని,రైతులకు సకాలంలో సరిపడా యూరియా సరఫరా చేయాలని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
Admin
తెలుగు వెలుగు టీవీ