Monday, 03 August 2026 09:59:25 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

14 నెంబర్ పిహెచ్సిలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి : పదో వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ డిమాండ్

Date : 27 August 2024 07:01 PM Views : 679

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు నెహ్రు బస్తీలో వైద్య శిబిరాన్ని 14వ నెంబర్ పిహెచ్సి ఆధ్వర్యంలో నిర్వహించారు . మంగళవారం నిర్వహించిన వైద్య శిబిరంలో పాల్గొన్న పదో వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు డెంగ్యూ ,మలేరియా విష జ్వరాల బారిన ప్రజలు పడుతున్నారని దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు వార్డులో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నేటి వైద్య శిబిరంలో సుమారు 80 మంది ప్రజలకు రక్త పరీక్షలు, బీపీ, షుగర్ తదితర పరీక్షలు నిర్వహించగా అందులో నలుగురికి సీజనల్ జ్వరం ఉందని నిర్ధారించడం జరిగింది. కానీ రామవరం పి హెచ్ సి లో ఓపి రోగుల సంఖ్య పెరిగిన దానికి అనుగుణంగా వైద్యాన్ని అందించే స్టాఫ్ లేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి పెరిగిన ఓపికి తగ్గట్టుగా స్టాఫ్ నర్స్ లు ,ఏఎన్ఎంలు, సబ్ స్టాప్ అటెండర్ ,స్వీపర్ ,ఫుల్ టైం డాక్టర్ని ,ఫార్మస్టిక్ అలాగే ఆశా వర్కర్లను పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు .18 మంది పనిచేసే దగ్గర పదిమంది చేస్తే ఎలా ప్రజలకు వైద్యం అందుతుందని ఆమె ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు స్పందించి స్టాప్ సంఖ్యను పెంచాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నీ వైద్య శిబిరంలో డాక్టర్ రాము మాట్లాడుతూ ప్రజలు వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ, పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని ,జ్వరం లక్షణాలు కనిపియ్యగానే వెంటనే వైద్యుని సంప్రదించాలని సూచించారు, ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం లు రావుల కవిత, తార ,ఆశా వర్కర్ భవాని, ఆఫీస్ సబార్డినేట్ సుదర్శన్, అంగన్వాడి టీచర్ సరోజ ఏరియా పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :