తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు నెహ్రు బస్తీలో వైద్య శిబిరాన్ని 14వ నెంబర్ పిహెచ్సి ఆధ్వర్యంలో నిర్వహించారు . మంగళవారం నిర్వహించిన వైద్య శిబిరంలో పాల్గొన్న పదో వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు డెంగ్యూ ,మలేరియా విష జ్వరాల బారిన ప్రజలు పడుతున్నారని దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు వార్డులో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నేటి వైద్య శిబిరంలో సుమారు 80 మంది ప్రజలకు రక్త పరీక్షలు, బీపీ, షుగర్ తదితర పరీక్షలు నిర్వహించగా అందులో నలుగురికి సీజనల్ జ్వరం ఉందని నిర్ధారించడం జరిగింది. కానీ రామవరం పి హెచ్ సి లో ఓపి రోగుల సంఖ్య పెరిగిన దానికి అనుగుణంగా వైద్యాన్ని అందించే స్టాఫ్ లేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి పెరిగిన ఓపికి తగ్గట్టుగా స్టాఫ్ నర్స్ లు ,ఏఎన్ఎంలు, సబ్ స్టాప్ అటెండర్ ,స్వీపర్ ,ఫుల్ టైం డాక్టర్ని ,ఫార్మస్టిక్ అలాగే ఆశా వర్కర్లను పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు .18 మంది పనిచేసే దగ్గర పదిమంది చేస్తే ఎలా ప్రజలకు వైద్యం అందుతుందని ఆమె ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు స్పందించి స్టాప్ సంఖ్యను పెంచాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నీ వైద్య శిబిరంలో డాక్టర్ రాము మాట్లాడుతూ ప్రజలు వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ, పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని ,జ్వరం లక్షణాలు కనిపియ్యగానే వెంటనే వైద్యుని సంప్రదించాలని సూచించారు, ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం లు రావుల కవిత, తార ,ఆశా వర్కర్ భవాని, ఆఫీస్ సబార్డినేట్ సుదర్శన్, అంగన్వాడి టీచర్ సరోజ ఏరియా పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ