తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వివేకవర్ధిని డిగ్రీ & పీజీ కళాశాల కొత్తగూడెంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ మరియు సైబర్ సెక్యూరిటీపై నిర్వహించిన 2 రోజుల శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ మరియు ఇతర అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలపై విలువైన జ్ఞానం, అవగాహన కల్పించారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఈ సాంకేతిక పరిజ్ఞానాల ప్రాముఖ్యత, వినియోగాల గురించి విద్యార్థులు తెలుసుకునేందుకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడింది. కళాశాల ప్రిన్సిపాల్ CH. సతీష్ శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులను అభినందించారు. శిక్షణలో పొందిన జ్ఞానం, నైపుణ్యాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ట్రైనింగ్ & ప్లేస్మెంట్ ఆఫీసర్ (TPO) బి. ఉమామహేశ్వరి కూడా విద్యార్థుల చురుకైన భాగస్వామ్యాన్ని అభినందించారు. సాంకేతిక మరియు కెరీర్కు సంబంధించిన నైపుణ్యాలను నిరంతరం అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కళాశాల యాజమాన్యం అభినందనలు 12 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరి కృషిని కళాశాల యాజమాన్యం అభినందించింది. విద్యార్థులకు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలపై విలువైన అవగాహ కల్పించినందుకు సంతోషం వ్యక్తం చేసింది. కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ M. ప్రణవ్ గారు ట్రైనింగ్ పూర్తిచేకునన్న విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందచేశారు. విద్యార్థులు నూతన సాంకేతిక పరిజ్ఞానాలను స్వీకరించాలని, నిరంతరం తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని, భవిష్యత్తులో లభించే ఉద్యోగ, కెరీర్ అవకాశాలకు సిద్ధం కావాలని సూచిస్తూ ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ