Wednesday, 17 June 2026 02:49:51 PM
# జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్. # అశ్వారావుపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. పేదల సంక్షేమం, అభివృద్ధే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # సింగరేణి యాజమాన్యం కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలి - గుర్తింపు సంఘం కేంద్ర కౌన్సిల్ సమావేశంలో కూనంనేని. # 16 వ డివిజన్లో ఇందిరమ్మ చీరల పంపిణీ. 18 సంవత్సరాల పైపడిన మహిళలందరికీ చీరలు ఇవ్వాలి. 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా UPHC రామవరం లో అవగాహన కార్యక్రమం

Date : 08 June 2026 06:45 PM Views : 120

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మన ఆరోగ్యం మన చేతుల్లోనే : Dr తుకారాం రాథోడ్ DMHO ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా UPHC రామవరం నందు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ (DMHO) ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా “మన ఆరోగ్యం మన చేతుల్లోనే” అనే నినాదంతో పర్యావరణ పరిరక్షణ మరియు ప్రజారోగ్యంపై విస్తృత అవగాహన కల్పించారు. డాక్టర్ తుకారాం రాథోడ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి అనేవి సమాజ ఆరోగ్యానికి అత్యంత కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ ఆరోగ్య దినోత్సవాల ప్రాముఖ్యతపై కూడా అవగాహన కల్పించారు, వాటిలో: ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రపంచ మెదడు కణితులు (Brain Tumours) దినోత్సవం ప్రపంచ సముద్రాల దినోత్సవం అలాగే “RRR – Reduce, Reuse, Recycle” ద్వారా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. Anti Malaria Month ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిలువ లేకుండా ఉంచుకోవాలని ప్రతి శుక్రవారం ఫ్రైడే ఫ్రైడే పాటించాలని, కూలర్లు, కుండ పెంకులు, ఫ్రిజ్ , టైర్లు , కొబ్బరి బోండాలు ప్లాస్టిక్ కవర్లు, రోళ్ళు , ఖాళీ సీసాలు, పగిలిపోయిన ప్లాస్టిక్ డబ్బులు, పూల కుండీలు మొదలగు వాటిలో వర్షపు నీరు నిలువ ఉండి దోమలు పెరిగే అవకాశం ఉంటుంది , దోమ కాటువలన మలేరియా , డెంగ్యూ, చికెన్ గునియా, బోదకాలు, మెదడువాపు ,మొదలగు వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తెలియజేశారు చిన్న దోమ కాటు వలన ప్రాణాంతకమైన వ్యాధులు వస్తాయని ఇంటి పరిసర ప్రాంతాల్లో పనికిరాని వస్తువులను తీసివేయాలని నీరు నిలువ లేకుండా చూసుకోవాలని, నీటి గుంటలలో కిరోసిన్ , బండి ఆయిల్ మొదలైనవి వేసుకోనుట ద్వారా దోమ పిల్లలు పెరగకుండా నివారించవచ్చని తెలియజేశారు , వర్షాకాలంలో నీరు నిలువ లేకుండా ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని తెలియజేశారు , Anti Diarrhoea Month బాగంగా ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత, ఇంటి పరిసరాల శుభ్రత పాటించాలని సూచించారు, మరుగుదొడ్లను వాడిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, పాలిచ్చే తల్లులు వంట చేసే వారు చేతులను శుభ్రంగా కడుకోవాలని తెలియజేశారు , చేతి గోర్లను తరచుగా కత్తిరించుకోవాలని నోటిలో పెట్టి కత్తిరించడం మానుకోవాలని తెలియజేశారు, చేతుల శుభ్రం లేకపోవడం వలన అనేక అంటూ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తెలియజేశారు, ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు ఎవరికైనా డయేరియా లక్షణాలు కల్పించినట్లయితే జింక్ మరియు ఓఆర్ఎస్ పాకెట్స్ అందించి దగ్గర్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సదుపాయం తీసుకోవాలని తెలియజేశారు , 14 సంవత్సరాల వయసు కిశోర బాలికలకు HPV టీకా (HPV Vaccine) ప్రాముఖ్యతను వివరించి, సకాలంలో టీకాలు తీసుకోవడం ద్వారా గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. అర్హులైన బాలికలకు అందరికీ HPV వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించాలని తెలియజేశారు ఈ సందర్భంగా డాక్టర్ తుకారాం రాథోడ్ UPHC రామవరం నందు మొక్క నాటడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ మొక్కలు నాటారు. “మన ఆరోగ్యం మరియు పర్యావరణ ఆరోగ్యం పరస్పరం అనుసంధానమై ఉన్నాయి. పర్యావరణాన్ని కాపాడితేనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుంది.” “ఆరోగ్యకరమైన పర్యావరణం – ఆరోగ్యకరమైన జీవితం” “Reduce, Reuse, Recycle – ప్లాస్టిక్‌ను తగ్గిద్దాం, భవిష్యత్తును కాపాడుదాం” ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు పద్మ , శంకర్ , సుధాకర్ రాజు, శంకరమ్మ నర్సింగ్ ఆఫీసర్, శ్రీనివాసరావు కమ్యూనిటీ కోఆర్డినేటర్, రాజేశ్వరి ,దిలీప్, ఆరోగ్య సిబ్బంది ఆశా కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :