తెలుగు వెలుగు టీవీ - వార్తలు / ఖమ్మం : ఖమ్మంలోని సోనోవిజన్ షోరూమ్లో జరిగిన భారీ చోరీ ఘటనపై సీపీ సునీల్ దత్ గురువారం ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. నిందితులను త్వరగా గుర్తించి అరెస్టు చేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. క్లూస్ టీమ్ వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరిస్తుండగా, సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ