Sunday, 02 August 2026 06:40:50 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

మున్సిపాలిటీల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి : జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి. పాటిల్

Date : 09 February 2026 02:28 PM Views : 142

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మున్సిపాలిటీలు మరియు మున్సిపల్ కార్పొరేషన్‌లకు నిర్వహించిన 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా, ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులు, ఉద్యోగులు మరియు సహాయక సిబ్బందికి ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా చేపట్టిన ఓటింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. జిల్లాలోని పట్టణ స్థానిక సంస్థల పరిధిలో పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించి ఫారమ్–XIV స్వీకరణ, పోస్టల్ బ్యాలెట్ పేపర్ల జారీ, ఓటింగ్ నిర్వహణ తదితర అన్ని దశలను ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు పకడ్బందీగా అమలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 23 పోస్టల్ బ్యాలెట్ పేపర్లు ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా జారీ చేయగా, వాటిలో 22 బ్యాలెట్లు సేవా ఓటర్లకు అందజేయడం జరిగింది. ఈ ప్రక్రియలో మొత్తం 23 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోగా, ఇందులో 13 మంది పురుషులు, 10 మంది మహిళలు ఉన్నారు. అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 27 పోస్టల్ బ్యాలెట్ పేపర్లు జారీ చేయబడగా, అందులో 27 మంది సేవా ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించారు. ఇందులో 12 మంది పురుషులు, 15 మంది మహిళలు పాల్గొన్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 110 పోస్టల్ బ్యాలెట్ పేపర్లు జారీ చేయబడగా, అందులో 110 మంది సేవా ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించారు. వీరిలో 63 మంది పురుషులు, 47 మంది మహిళలు ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా విజయవంతంగా పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ స్పష్టం చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :