Thursday, 17 September 2026 06:48:57 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

ప్రతీ విగ్రహం స్టేడియం గ్రౌండ్ కు వచ్చేలా చర్యలు తీసుకోండి : గణేష్ నిమర్జన ఉత్సవ కమిటీ అధ్యక్షులు యెర్రా కామేష్

Date : 12 September 2026 02:22 PM Views : 574

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోండి గణేష్ నిమర్జన ఉత్సవ కమిటీ అధ్యక్షులు యెర్రా కామేష్ గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిమజ్జన కమిటీ అధ్యక్షులు,న్యాయవాది యెర్రా కామేష్ విజ్ఞప్తి చేశారు.శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత పవిత్ర గోదావరి నదిలో ఎక్కువ సంఖ్యలో విగ్రహాల నిమజ్జనం కార్యక్రమం జరుగుతుందని గుర్తు చేశారు.రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో గణపతి విగ్రహాలు పవిత్ర గోదావరి నదిలో నిమజ్జనానికి తరలి వెళ్తాయని తెలిపారు.వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అదే విధంగా జిల్లా కేంద్రంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో గణపతి ప్రతిమలను ఏర్పాటు చేసిన వారు సాధ్యమైనంత తొందరగా ప్రకాశం స్టేడియం గ్రౌండ్ కు చేరుకునేలా ముందస్తు ప్రణాళికను రూపొందించుకోవాలని కోరారు.గతంలో స్థానిక ప్రకాశం స్టేడియం వచ్చిన తర్వాతే నిమజ్జనానికి వెళ్లే విధంగా రూట్ మ్యాప్ ఉండేదని గుర్తు చేశారు కాలక్రమేనా ఈ విధానానికి స్వస్తి పలకడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని గుర్తు చేశారు.గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని 25వ తేదీన జరిగే గణపతి శోభాయాత్రను ప్రకాశం స్టేడియం గ్రౌండ్ నుంచి అనుమతించాలని ఆవిధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులకు,పోలీసు యంత్రాంగానికి,ఉత్సవ కమిటీ నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు గోదావరి పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు మొదలవడం శుభసూచకమని అన్నారు.గణపతి నిమజ్జన శోభాయాత్ర ముగిసేవరకూ బెల్టు షాపులను ఓపెన్ చెయ్యకుండా ఎక్సైజ్,పోలీసు శాఖ వారు చర్యలు తీసుకోవాలని,వారికి మద్యం షాపు యజమానులు సహకరించాలని కోరారు.నిమజ్జన శోభాయాత్రను ప్రకాశం స్టేడియం గ్రౌండ్ లో ఒంటిగంటకు పూజ చేసి ప్రారంభించడం జరుగుతుందని ఈలోగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు తమ తమ ప్రతిమలతో ప్రకాశం స్టేడియం గ్రౌండ్ కు చేరుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఒంటిగంట నుంచే గణపతి శోభాయాత్రను ప్రారంభించడం ద్వారా పవిత్ర భద్రాద్రి గోదావరి నదిలో నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగేందుకు సహకరించిన వారమవుతామని తెలిపారు గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధల తో ముడిపడి ఉన్నదని ఈ విషయాన్ని ఉత్సవ కమిటీ సభ్యులు,భక్తులు గమనించాలన్నారు టపాసులు పేలుస్తూ,పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ డీజే బాక్సులతో ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా సాంప్రదాయ వాయిద్యాలతో భక్తి భావంతో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు ఏ.లక్ష్మణ్,ప్రధాన కార్యదర్శి దారా రమేష్,వందనపు శ్రీధర్,అకిరెడ్డి మహేష్,మెరుగు చింటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :