తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కాంగ్రెస్ సర్కార్ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయం ఎదుట గురువారం బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు.22ఏ ద్వారా నిషేధిత జాబితాలో పెట్టిన ప్రైవేట్ భూములను అందులో నుంచి విడుదల చేయాలని,రామవరం ప్రాంత వాసులకు పొజీషన్ సర్టిఫికెట్లు జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ 1000 రోజుల పాలనా వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు పిలుపు మేరకు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర రావుల సూచనల మేరకు ఈ ధర్నా జరిగింది.ఈ కార్యక్రమంలో వందలాదిగా పాల్గొన్న బీఆర్ఎస్ శ్రేణులు గులాబీ కండువాలు ధరించి, జెండాలు, ప్లకార్డులు చేతబట్టి రేవంత్ రెడ్డి అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్ద పెట్టున నినాదాలిచ్చారు.తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హయాంలో 76 జీవో ప్రకారం కొత్తగూడెం మునిసిపాలిటీలో 10వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందని మాజీ మున్సిపల్ చైర్మెన్ సీతామహాలక్ష్మీ, మాజీ వైస్ చైర్మెన్ వేల్పుల దామోదర్ తెలిపారు. ఆ జీవో ప్రకారం సిద్ధంగా ఉన్న 4వేల పట్టాలను వెంటనే పేదలకు పంపిణీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అదేవిధంగా రామవరం ప్రాంత వాసులు ఇండ్లు కొనుక్కోలేక,అవసరాలకు అమ్ముకునే వీలులేక ఇబ్బందులు పడుతున్నారని, వారికి వెంటనే పొజీషన్ సర్టిఫికెట్లు జారీ చేయాల్సిందిగా ఆర్డీవోకు ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు."అబద్ధపు హామీలతో అధికారం-1000 రోజులుగా కాంగ్రెస్ మోసం","అమలు కాలేదు ఒక్క గ్యారంటీ-హస్తం పతనానికి మాది గ్యారంటీ","ఆరు గ్యారంటీ లు ఎగ్గొట్టిన రేవంత్-నిన్ను ఇంటికి పంపడం మా వంతు"అని రాసిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద పెట్టున నినాదాలిచ్చారు.ఈ ఆందోళన కార్యక్రమంలో మునిసిపల్ కార్పొరేషన్ కార్పోరేటర్ సాగర్ మల్హోత్రా, మాజీ కౌన్సిలర్లు బండారు రుక్మాంగధర్, అంబుల వేణుగోపాల్, నాయకులు ముద్దంగుల మహేష్, ఏమునరి శివ కృష్ణ, జూనూరి రాజేష్, ఖాజాభక్ష్, మాదాసు పద్మ, ధీకొండ సునీత, మనోజ్, జానీ, కాళీ, సచిన్, అమర్, సిద్ధూ, సుందర్, సురేందర్, చంద్రయ్య, సుధీర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ