Thursday, 17 September 2026 04:25:29 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో మంత్రి పొంగులేటి సమావేశం.

Date : 04 September 2026 06:52 PM Views : 117

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాచలం ఆలయ పునః నిర్మాణాల్లో వేగం పెంచాలి : రాష్ట్ర మంత్రి పొంగులేటి.భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో మంత్రి పొంగులేటి సమావేశం. గత ప్రభుత్వ వైఫల్యంతోనే పోలవరం ముప్పు : విలేఖరుల సమావేశంలో : మంత్రి పొంగులేటి. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయం దర్శించుకున్న అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ,సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు,పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు,అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి సమీక్షా సమావేశం క్షేత్రస్థాయిలో నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ..భద్రాచలం ఆలయ నిర్మాణ పనులు ప్రతీ రోజు పకడ్బందీగా చేయాలని,మూడు షిఫ్ట్ లుగా సిబ్బందిని ఏర్పాటు చేసుకొని 24గంటలు పని జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 25శాతం పనులే జరిగాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.పనుల్లో అలసత్వం వహింస్తే ఊరుకొనే ప్రసక్తే లేదని హెచ్చరించారు.దేవాదాయశాఖ పై తమకు ఎంతో నమ్మకం ఉందని, నాణ్యత ప్రమాణాలు తగ్గకుండా ఆలయ నిర్మాణాలు జరిపించాలని సూచించారు.అదేవిధంగా ఆలయానికి తీసుకొనే రాళ్ళ నాణ్యత ఖచ్చితంగా ఉండాలని,మేలిమి కలిగిన వాటిని నిర్మాణాలకు ఉపయోగించాలని సంబంధిత నిర్మాణ సిబ్బందికి తెలిపారు.ఎటువంటి అవసరాలు ఉన్న దగ్గర ఉండీ చూసుకోవాలని భద్రాచలం ఐటీడీఏ పీ.ఓ రాహుల్ ను మంత్రి ఆదేశించారు.ఆలయ నిర్మాణాలకు ఏ నిర్ణయాలైన తక్షణమే తీసుకోవాలని,వాటి జాబితా ప్రణాళిక ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల అందించాలన్నారు. ఏ అవసరం ఉన్న తన దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వంకు ప్రతిపాదనలు పంపి,అనుమతి తీసుకొని వాటిని తక్షణమే మంజూరు చేయిస్తానని అధికారులకు మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో ఆలయ ఈ.ఓ దామోదర్, క్షేత్ర కన్సల్టెంట్ ప్రతినిధులు సత్య కృష్ణ, సూర్యనారాయణమూర్తి, శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.గత ప్రభుత్వ వైఫల్యంతోనే పోలవరం ముప్పు : విలేఖరుల సమావేశంలో : మంత్రి పొంగులేటి గతంలో పదేళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యంతోనే.. మనకు పోలవరం ముప్పు పొంచి ఉందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం భద్రాచలంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో దేవస్థాన అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించి, అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరితో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలను, భద్రాచలం చుట్టుపక్కల ఐదు గ్రామపంచాయతీలను ఆంధ్రాలో విలీనం చేయడం బాధాకరమని అన్నారు. ఎల్ నినో ప్రభావంతో ప్రస్తుతం వరదలు లేకున్నా... భవిష్యత్ లో భద్రాచలం నుంచి ములుగు వరకు సాధారణం కంటే 20-25 అడుగుల వరకు అధికంగా బ్యాక్ వాటర్ ఉధృతి పెరిగే అవకాశం ఉందని తెలిపారు. గతంలో సి డబ్ల్యూ సి, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలకు గోదావరి పరీవాహక ప్రాంత ఎమ్మెల్యేలు విన్నవించినా.. వారు పట్టించుకోవడం లేదని తెలిపారు. పోలవరానికి తాము వ్యతిరేకం కాదని .. తెలంగాణలో ముంపు ప్రాంతాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. పార్లమెంట్ సమావేశాల నాటికి తెలంగాణ ఎంపీలు, గోదావరి పరీవాహక ప్రాంత ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి.. పోలవరం ప్రభావంతో జరిగే వరద ముప్పు తీవ్రతను వివరించి.. పునః పరిశీలించాలని కోరతామని ప్రకటించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఐటీడీఏ పీవో రాహుల్ పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :