తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్, సీతమ్మ సాగర్, పులుసుబొంత ప్రాజెక్టులు, బీ.టీ.పీ.ఎస్ భూసేకరణ వేగవంతం చేయాలి. భూభారతి రీ - సర్వే,సాదా బైనమా,రెవిన్యూ సదస్సులు క్యాంప్ మోడో లో జరిపించాలి.నిర్దేశించిన సమయాల్లో పూర్తి చేయాలని ఐ.డీ.ఓ.సీలో ని కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి ఎస్.డీ.సీ (ఎల్.ఏ), తహసీల్దార్,ఇరిగేషన్, సంబంధిత సెక్షన్ అధికారులు, సర్వేయర్లతో వీడియో కాన్ఫిరెన్స్.భూ సేకరణ పనులు,సర్వేలను త్వరితగతిన పూర్తి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు.ఐ.డీ.ఓ.సీ లోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వేణుగోపాల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట్ ,జిల్లాలోని తహసీల్దార్,ఇరిగేషన్, సంబంధిత సెక్షన్ అధికారులు, సర్వేయర్లలతో జిల్లా కలెక్టర్ అంకిత్ వీడియో కాన్ఫిరెన్స్ గురువారం నిర్వహించారు.సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, సీతమ్మ సాగర్ ప్రాజెక్టు, పులుసుబొంత ప్రాజెక్టులు, బీ.టీ.పీ.ఎస్ ల భూసేకరణ పనులు వేగవంతం చేయాలని తాహసిల్దార్లను, సర్వేయర్లను ఆదేశించారు.నిర్దేశించిన సమయాలోపు పనులు పూర్తి చేసేలా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలన్నారు. ఎప్పటికప్పుడు పెండింగ్లో ఉన్న పనులను మానిటరింగ్ చేస్తూ సమస్యలు పరిష్కరించేలా తాహసిల్దారులతో మాట్లాడాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) వేణుగోపాల్ కు జిల్లా కలెక్టర్ సూచించారు.జిల్లాలో అన్నీ మండలాల్లో కొనసాగుతున్న భూభారతి రీ - సర్వే,సాదా బైనమా,రెవిన్యూ సదస్సులు క్యాంప్ మోడో లో జరిపించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ప్రణాళిక బద్ధంగా,నిబద్ధతతో సకాలంలో సర్వే బృందాలతో అధికారులు పనిచేయించాలని తెలిపారు.సర్వేయర్లు, లైసెన్స్ సర్వేయర్లు, ఐ.కే.పీ సర్వేయర్లు ఈ రీ - సర్వే ప్రక్రియను ను సీరియస్ గా తీసుకొవాలని జిల్లా కలెక్టర్ కోరారు.జిల్లాలో ఉన్న అన్నీ మండలాల తహసీల్దార్లు, సర్వేయర్లు రీ - సర్వే ను సకాలంలో పూర్తి చేసేలా ప్రతిరోజు ప్రణాళిక బద్ధంగా సర్వే చేసి,ఆ రికార్డులను నమోదు ప్రక్రియ పూర్తిచేయాలని సూచించారు. ప్రతి మండలంలో కనీసం ఇద్దరు నుంచి ముగ్గురు సర్వేయర్లతో సర్వే చేయించాలని తెలిపారు.ఇటీవలే జిల్లాలో పది మండలాల్లో గ్రామసభలు నిర్వహించారని,ఆ ప్రాంతాల్లో రీ - సర్వే వేగవంతమయ్యేలా పనులు చేపట్టాలని ల్యాండ్ సర్వే ఏ.డి శ్రీనివాస్ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ప్రతి మండల తాహసిల్దార్లు, సర్వేయర్లతో వారు చేస్తున్న సర్వే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఎంత సర్వే చేశారని,ఆ సర్వే వివరాలు రికార్డును సకాలంలో పూర్తి చేయాలని తెలియజేసారు.యుద్ధ ప్రాతిపదికన సర్వే పూర్తిచేసేలా తాహసిల్దార్లు, సర్వేయర్లు బాధ్యతతో పనిచేసే సర్వే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. భూభారతి దరఖాస్తులు ప్రతి మండల తాసిల్దార్లు, ఆర్డీవోలు, సబ్ కలెక్టర్ లాగిన్ లో పెండింగ్లో ఉన్నాయని వాటిని తక్షణమే పరిశీలించి పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "సర్" కార్యక్రమంలో ఓటర్లు వద్ద నుంచి ఓటు నమోదుకు సరైన ధ్రువపత్రాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలని ఏ.ఆర్.ఓ.ఎస్, ఏ.ఈ. ఆర్.ఓ.ఎస్ బాధ్యత తీసుకొని పనిచేయాలన్నారు. ఈ ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా ఉందని, ప్రతి ఓటరు ధ్రువపత్రాలు సక్రమంగా ఉండేలా క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ