Sunday, 02 August 2026 04:08:03 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

Date : 13 April 2026 08:02 PM Views : 232

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం (అర్బన్) జీవితం విలువైనది భద్రత మన బాధ్యత అంటూ 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ ఆధ్వర్యంలో వాహనదారులు హెల్మెట్ ధరించి ర్యాలీ నిర్వహించారు. సోమవారం 16వ డివిజన్లో జరిగిన ర్యాలీలో కార్పొరేటర్ మునిగడప పద్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు మన కార్పొరేషన్ పరిధిలో రోడ్డు భద్రత వారోత్సవాలు జరుగుతున్నాయని అన్నారు .జీవితం విలువైనది, భద్రత మన బాధ్యత, రోడ్డు ప్రమాదాలనేవి కేవలం వార్తలు మాత్రమే కాదని ఎన్నో కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగులుస్తున్నాయి ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించడం అనేది కేవలం జరిమానాల నుంచి తప్పించుకోవడానికి కాదు, మన ప్రాణాలని మనం కాపాడుకోవడానికి నిబంధనలు పాటించాలన్నారు. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు నాణ్యమైన హెల్మెట్ ధరించడం మర్చిపోవద్దు ఇది మన ప్రాణ రక్ష కవచం అని అన్నారు. కారులో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ప్రమాద తీవ్రత తగ్గుతుందని, వేగం కంటే ప్రాణం ముఖ్యం కాబట్టి పరిమిత వేగంతో ప్రయాణించాలి అన్నారు. మనం ఐదు నిమిషాలు ముందు వెళ్లడం కోసం ట్రాఫిక్ సిగ్నల్స్ ఉల్లంఘించి ప్రమాదాలకు కారణమవుతున్నామని అన్నారు .ఆ ఐదు నిమిషాల తొందర మీ జీవితాంతం మీ కుటుంబాన్ని దూరం చేస్తుంది ఐదు నిమిషాలు లేటుగా వెళ్తే నష్టమేమీ లేదు. వాహనదారులు పాదచారులకు ప్రాధాన్యత నివ్వాలి, వాళ్లను గమనిస్తూ డ్రైవింగ్ చేయాలి మన నగరం సురక్షితంగా ఉండాలంటే కేవలం రోడ్లు బాగుంటే సరిపోదు. మన ప్రయాణ విధానం మారాలి. చట్టం మీద భయంతో కాదు, బాధ్యతతో నిబంధనలు పాటిద్దాం. ఈ రోజు నుంచి మనమందరం ఒక ప్రతిజ్ఞ చేద్దాంమని, నేను ట్రాఫిక్ నియమాలను పాటిస్తాను, నా కుటుంబాన్ని నాతోటి వారిని కాపాడుకుంటానని ఆమె వారితో ప్రతిజ్ఞ చేయించారు. మద్యం సేవించి వాహనం నడపవద్దు.రోడ్డు భద్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత. ఈ వారోత్సవాల స్ఫూర్తిని ఏడాది పొడవునా కొనసాగిద్దాంమని ఆమె పిలుపునిచ్చారు. విరాలిలో డివిజన్ పౌరులు మునిగడప వెంకటేశ్వర్లు, జిత్తుక దిలీప్ ,గుంజ వెంకన్న, రామ్ రాకేష్ ,వాసం బాబు, సబ్బని పాపారావు ,బి శ్రీను, కందుకూరి గంగరాజు, అఖిల్ ,సూర్య తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :