Thursday, 17 September 2026 04:01:39 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

భారీ నిషేదిత గంజాయిని పట్టుకున్న పోలీసులు, సిబ్బందిని అభినందించిన ఎస్పీ రోహిత్ రాజ్

Date : 28 May 2025 01:39 PM Views : 1092

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలలో నాలుగు కోట్ల పదిహేను లక్షల రూపాయల విలువ చేసే నిషేదిత గంజాయిని స్వాదీనం చేసుకున్న జూలూరుపాడు పోలీసులు. మంగళవారం సాయంత్రం 6.10 గంటలకు విశ్వసనీయ సమాచారం మేరకు జులూరుపాడు. పోలీసులు మరియు సి సి ఎస్ పోలీసులు సంయుక్తంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని పడమట నర్సాపురం గ్రామ పంచాయతి ఆఫీస్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీలలో HR 55AH7375 అను నంబరు గల ఐచర్ వ్యాస్ ను ఆపి తనిఖీ చేయగా 830.540 (ఎనిమిది క్వింటాల ముప్పై కిలోల ఐదు వందల నలభై గ్రాములు) ప్రభుత్వ నిషేదిత గంజాయిని గుర్తించడం జరిగింది. సుమారుగా 4,15,27,000/- రూపాయల విలువ గల ఇట్టి గంజాయిని విలీసులు స్వాదీనం చేసుకోవడమైనది. ఐచర్ వ్యానులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో తులసిపాక గ్రామం నుండి అట్టి నిషేదిత గంజాయిని లోడ్ చేసుకొని భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి తరలిస్తున్నట్లు విదారణలో తేలింది. ఇట్టి నిషేధిత గంజాయిని అమ్మిన వ్యక్తులపైన, కొనుగోలు చేసిన వ్యక్తులు మరియు రవాణా చేస్తున్న వ్యక్తులందరిపై కేసు నమోదు చేసే అట్టి రవాణాకు ఉపయోగించిన ఐచర్ వాహనము ను మరియు రెండు మొబైల్ పోస్టేను కూడా సీజ్ చేయడం జరిగినది. ప్రభుత్వ నిషేధత గంజాయి అక్రమ రవాణాను జిల్లా పోలీసులు సమర్ధవంతంగా అడ్డుకోవడం జరుగుతుంది. 2024 సంవత్సరంలో 112 కేసులలో 8078 కేజీలు, 2025 సంవత్సరంలో ఇప్పటివరకు 3002 కిలోల నిషేదిత గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. పట్టుబడిన ఇద్దరు వ్యక్తులను జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్జునకు తరలించడం జరిగినది. నిందిత గంజాయి అక్రమ రవాణాను సమర్ధవంతంగా అడ్డుకుని నిందితులను చాఖ చక్యంగా పట్టుకున్న జూలూరుపాడు సిఐ ఇంద్రన్ నారెడ్డి, ఎస్సై రవి, సిసిఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్,ఎస్సైలు ప్రవీణ్, మరియు సిబ్బందిని ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ప్రత్యేకంగా అభినందించారు. ఎస్పీ రోహిత్ రాజ్ మీడియా ద్వారా మాట్లాడుతూ నిషేధిత అక్రమ గంజాయి రవాణా ద్వారా సంపాదించిన ఆస్తులను సైతం ప్రభుత్వం జప్తు చేసుకుంటుందని మునుముందు మత్తు పదార్థాల రవాణా మరియు అమ్మకం కొనుగోలు జరిపినటువంటి వారిని సహించబోమని హెచ్చరించారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :