Sunday, 02 August 2026 02:27:10 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి .

Date : 21 July 2026 07:41 PM Views : 94

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రతి బీఎల్‌వో రోజుకు కనీసం 100 మంది ఓటర్ల వివరాలను డిజిటలైజ్ చేయాలి. ఓటరు జాబితాకు సంక్షేమ పథకాలతో ఎలాంటి సంబంధం లేదని ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలి. 50 శాతం కంటే తక్కువ పురోగతి ఉన్న పోలింగ్ స్టేషన్లపై ప్రత్యేక దృష్టి సారించాలి. జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి. ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో అందుబాటులో ఉన్న సమయాన్ని పూర్తిస్థాయిలో వినియోగించి ఓటర్ల వివరాల డిజిటలైజేషన్‌ను వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.మంగళవారం హైదరాబాద్ నుంచి ఎస్‌ఐఆర్ కార్యక్రమం పురోగతి, ఓటర్ల వివరాల డిజిటలైజేషన్, ఎన్యూమరేషన్ ప్రక్రియ తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం (ఐడీఓసీ) నుంచి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అంకిత్ ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ప్రతి బూత్ స్థాయి అధికారి (బీఎల్‌వో) రోజుకు కనీసం 100 మంది ఓటర్ల వివరాలను డిజిటలైజ్ చేసే లక్ష్యంతో పనిచేయాలని సూచించారు. జూలై 15వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 లక్షల ఓటర్ల వివరాలు డిజిటలైజ్ కాగా, గత ఏడు రోజుల్లో కేవలం 22 లక్షల వివరాలు మాత్రమే డిజిటలైజ్ అయ్యాయని, ఈ పురోగతి ఆశించిన స్థాయిలో లేదన్నారు. వచ్చే సమీక్షా సమావేశం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 90 శాతం డిజిటలైజేషన్ పూర్తి చేయాలనే లక్ష్యంతో అన్ని జిల్లాలు పనిచేయాలని ఆదేశించారు.పట్టణ ప్రాంతాల్లో, ముఖ్యంగా మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో డిజిటలైజేషన్ పురోగతి చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపట్టి, వచ్చే వారం గరిష్ఠ స్థాయిలో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఓటరు జాబితా వివరాలను ప్రభుత్వ సంక్షేమ పథకాలతో అనుసంధానం చేస్తున్నారనే వదంతులను జిల్లా యంత్రాంగం వెంటనే ఖండించాలని సూచించారు. ఎన్యూమరేషన్ ఫారంలో ఆధార్ నంబర్ ఇవ్వడం పూర్తిగా ఐచ్ఛికం మాత్రమేనని, బీఎల్‌వోలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధార్ నంబర్ ఇవ్వాలని ఓటర్లపై ఒత్తిడి చేయరాదని స్పష్టం చేశారు.ఆన్‌లైన్‌లో ఇప్పటికే ఎన్యూమరేషన్ ఫారం సమర్పించిన ఓటర్లను మళ్లీ ఆఫ్‌లైన్ ఫారం ఇవ్వాలని కోరడం అవసరం లేదన్నారు. కొన్ని పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొంటూ, ప్రతి ఓటరికి ఎన్యూమరేషన్ ఫారం అందేలా బీఎల్‌వోలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫారం నింపడంలో ఓటర్లకు అవసరమైన సహాయం అందించాలని, ఈ ప్రక్రియపై రూపొందించిన అవగాహన వీడియోలను విస్తృతంగా ప్రజలకు చేరవేయాలని సూచించారు.కొంతమంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదని, మరికొందరి పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగించబడ్డాయని ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. అలాగే జీవించి ఉన్న కొంతమంది ఓటర్లను మరణించిన వారిగా నమోదు చేసిన ఘటనలు కూడా వెలుగుచూస్తున్నాయని, ఇలాంటి పొరపాట్లను వెంటనే గుర్తించి సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు.అధికారులందరూ తమ మొబైల్ నంబర్లను సంబంధిత వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా నవీకరించుకోవాలని సూచించారు. 50 శాతం కంటే తక్కువ డిజిటలైజేషన్ పురోగతి ఉన్న పోలింగ్ స్టేషన్లను ప్రత్యేకంగా గుర్తించి అక్కడ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అంకిత్ మాట్లాడుతూ, జిల్లాలో ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, సమయపాలనతో అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి బీఎల్‌వోకు రోజువారీ లక్ష్యాలను నిర్దేశించి, డిజిటలైజేషన్ పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. 50 శాతం కంటే తక్కువ పురోగతి ఉన్న పోలింగ్ కేంద్రాలను ప్రత్యేకంగా గుర్తించి అదనపు సిబ్బందితో పనులు వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని, ఓటరు జాబితాకు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఎలాంటి సంబంధం లేదన్న విషయాన్ని ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఎలాంటి అపోహలకు గురికాకుండా బీఎల్‌వోలతో సహకరించి తమ వివరాలను సకాలంలో నమోదు చేసుకోవాలని అని తెలిపారు .ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్నికల సూపరింటెండెంట్ రంగ ప్రసాద్, ఎంఎల్‌టీఓ సాయి కృష్ణ, ఎన్నికల సిబ్బంది నవీన్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :