తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఏరియాలోని NCWA ఉద్యోగులకు 01.09.2025 నాటికి అర్హత కలిగిన వారికి కేడర్ స్కీమ్/ టైం బౌండ్ ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మొత్తం 35 మంది ఉద్యోగులు అర్హత కలిగి ఉన్నారు వారిని ఈరోజు జిఎం కార్యాలయంలో ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి/ సెప్టెంబర్ నెలలో కేడర్ స్కీం ప్రమోషన్లు అందజేస్తామని అందులో భాగంగా ఈరోజు అర్హత కలిగిన ఉద్యోగులకు ఉత్తర్వులు అందిస్తున్నమని, ఉద్యోగులు ప్రతి ఒక్కరూ అంకితభావంతో విధుల యందు నైపుణ్యాన్ని పెంచుకోవాలని, వారికి కేటాయించిన విధులను రక్షణతో చేసి కంపెనీ పురోభివృద్ధిలో తమ వంతు పాత్రను పోషించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే ఈరోజు ఉత్తర్వులు అందుకునే ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లిలోని జేవిఆర్ఓసి మరియు కిష్టారం ఓసీలలో పనిచేస్తూ, అర్హత కలిగిన ఉద్యోగులకు ఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్స్ ఎన్విఆర్ ప్రహ్లాద్ మరియు ఎంవి నరసింహారావు ప్రమోషన్ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ జె. గట్టయ్య, ఐ.ఎన్.టి.యు.సి వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, ఏరియా ఇంజనీర్ కే.సూర్యనారాయణ రాజు, డిజిఎం (పర్సనల్) జి.వి. మోహన్ రావు, పద్మావతి ఖని ఏజెంట్ రామ్ భరోస్ మహాతో, మరియు డివైపిఎం జి. హరీష్ మరియు ఇతర విభాగాల అధిపతులు, ఆఫీస్ సిబ్బంది, మరియు ఉత్తర్వులు తీసుకొనుటకు వచ్చిన ఉద్యోగులు పాల్గొనడం జరిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ