Sunday, 02 August 2026 01:12:15 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలి: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు .

Date : 18 July 2026 08:10 PM Views : 120

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలి: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు . ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలి. జిల్లాల వారీగా సూపర్ ఎల్‌నినో కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఇన్‌చార్జి మంత్రుల సమీక్షలకు శాఖల వారీ సమగ్ర నివేదికలతో హాజరు కావాలి. సూపర్ ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదై వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు కార్యాచరణ ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి సూపర్ ఎల్‌నినో పరిస్థితులు, వర్షాభావ నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, వ్యవసాయ ప్రణాళికలు, తాగునీటి నిర్వహణ, ప్రత్యామ్నాయ పంటల సాగు తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఐడీఓసీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి జిల్లా సూపర్ ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.రైతులకు పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించి పంటల మార్పిడి విధానాలను ప్రోత్సహించాలని, తక్కువ నీటి అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, సాంకేతిక సూచనలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు నిరంతరం అందుబాటులో ఉండాలని తెలిపారు.అదేవిధంగా జిల్లాల వారీగా వర్షపాతం పరిస్థితులు, సాగు విస్తీర్ణం, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, తాగునీటి లభ్యత, పశుగ్రాసం, ఉపాధి హామీ పనులు, శాఖల వారీ కార్యాచరణ ప్రణాళికలపై సమగ్ర సమాచారాన్ని సిద్ధంగా ఉంచాలని సూచించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రులు, ప్రత్యేక అధికారులతో నిర్వహించనున్న సమీక్ష సమావేశాలకు అన్ని శాఖల అధికారులు పూర్తి స్థాయి నివేదికలతో హాజరు కావాలని ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ , జిల్లాలో ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖలతో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తూ ముందస్తు కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నామని తెలిపారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగు, నీటి పొదుపు పద్ధతులు, పంటల మార్పిడి, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే సాగు విధానాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, తాగునీటి సరఫరా, పశుగ్రాసం, ఉపాధి హామీ పనులు తదితర అంశాలపై కూడా సంబంధిత శాఖలు అప్రమత్తంగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఎలాంటి పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డి ఆర్ డి ఎ పి డి విద్యాచందన, హార్టికల్చర్ అధికారి కిషోర్ బాబు, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, గ్రౌండ్ వాటర్ ఏడి రమేష్, మున్సిపల్ కమిషనర్ సుజాత, డిపిఓ అనూష, సిపిఓ సునీత సంబంధిత శాఖ అధికారుల తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :