Sunday, 07 June 2026 07:44:11 AM
# బిజెపి పార్టీ సీనియర్ నాయకులు సొప్పరి క్రాంతి ఆధ్వర్యంలో గౌతంపూర్ లో మొక్కలు నాటడం జరిగినది. # ఈ నెల 7, 8 తేదీల్లో రెండు రోజులపాటు ఎఐటీయూసీ సెంట్రల్ కౌన్సిల్ సమావేశం. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి. # మున్సిపల్ కార్పొరేషన్‌లో సిపిఐ పక్ష బలాన్ని సమర్థవంతంగా చాటాలి.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు # నామా వినోద్‌పై దాడి చేసిన భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. # మీసేవ దరఖాస్తుల పరిశీలన పూర్తిగా ఆన్‌లైన్‌లోనే. జీపీఓలు, ఆర్‌ఐలకు అవగాహన కల్పించిన ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు. # ప్రజల ప్రాణ రక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలి. గోదావరి వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మరో రెండు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్న నేపథ్యంలో జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి. # భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప కాలనీ, రెవిన్యూ కాలనీల్లో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్. # విద్యార్థులు సాంస్కృతిక పోటీల్లో రాణించాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పెట్రోలింగ్,బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మాస్టర్ ఈ .కె ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కాకర్ల గ్రామం నందు ఉచిత హోమియో వైద్య శిబిరం. # భూభారతి, సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ పార్కులో ప్లాస్టిక్ ఏరివేత -మొక్కలు నాటిన ఎస్ జి ఎఫ్. # కొత్తగూడెం ఇల్లందు రహదారిపై స్కూటీని ఢీకొన్న లారీ. # పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ధరల పెరుగుదలపై రాజీలేని పోరాటం చేద్దాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # గోపన్నగూడెంలో మినీ మేడారం జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె. # జనగణన జాబితా వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # సమున్నత ఆశయాలతోనే భారత జాతీయ మహిళా సమాఖ్య ఆవిర్భావం. భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి. # ప్రజా సమస్యల పరిష్కార మార్గాన్ని చూపే విధంగా గ్రామ సభలు ఉండాలి. 16వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

అనాది నుండి ఆచారాలను కొనసాగిస్తున్న ఆదివాసి నాయక పోడులు, నర్సాపురంలో భక్తిశ్రద్ధలతో పెద్దమ్మ తల్లి కొలుపు

Date : 16 March 2026 05:29 PM Views : 359

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : భద్రాద్రి కొత్తగూడెం మార్చి 16 తెలుగు వెలుగు) : జూలూరుపాడు మండల పరిధి పడమట నర్సాపురం లో స్త్రీ శక్తి స్వరూపిణి అయిన పెద్దమ్మ తల్లి కొలుపు కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యింది. కొలుపు అనగా గ్రామదేవతలందరినీ ఒకే చోట చేర్చి మేళ్ల తాళాలతోటి ఆచార సాంప్రదాయంగా పూజించడాన్నే కొలుపు అంటారు. ఇది అనాదిగా శతాబ్దాల కాలం నుండి తరతరాలుగా ఆదివాసి గిరిజన నాయక పోడులు అనుసరిస్తూ, ఆచరిస్తూ, కొనసాగిస్తున్న సాంప్రదాయం. ఈ కొలుపు కార్యక్రమంలో ఆదివాసి నాయక పోడు గిరిజన పూజారులు ప్రధాన పాత్ర పోషిస్తారు. కొలుపు మొదలుకొని ముగింపు వరకు అన్ని కార్యక్రమాలు కటోర నియమనిష్టలతో ఆదివాసి సంస్కృతి, సాంప్రదాయాలతో నిర్వహిస్తారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో గ్రామ దేవత పెద్దమ్మ తల్లి, రాజు గొడుగులు, పోతురాజు, వీర ఖడ్గం, గణబాలలు, దేవరబాలలు, పూనకాల నడుమ గ్రామంలో కొలుపు కార్యక్రమం కోలాహాలంగా నిర్వహిస్తారు. కొలుపులో ప్రధానంగా పుట్ట బంగారం, బొడ్రాళ్ళు, కొలబియ్యం, సరువుల ఊరేగింపు, పట్నాలు, కళ్యాణం, కొండాలు తొక్కుట (అగ్నిపునీతం) ప్రధాన ఘట్టాలుగా నిర్వహిస్తారు. ఇలాంటి దైవ కార్యక్రమం నిర్వహణతో గ్రామ ప్రజలు, పశువులు, పంటలు, హానికరమైన వ్యాధులు రాకుండా, అంతా సుభిక్షంగా ఉండే విధంగా అమ్మ చూసుకుంటుందని ఆదివాసీల నమ్మకం. గ్రామంలో కొలుపు ఆఖరి రోజులైనా 21, 22 తారీకులలో అనగా శనివారం వనం (అడవి) నుండి సరువులు (మూడు సండ్ర చెట్లు) ను దేవతలకు ప్రతిరూపాలుగా భావించి గ్రామస్తులంతా కలసి ఊరేగింపుగా నగురు అనగా (దేవతను కూర్చోబెట్టి కొలిచే స్థలం) వద్దకు తీసుకొని వచ్చి వాటిని కాల్చి ఆదివారం ఉదయం ఆ నిప్పురవ్వలపై నడిచి తమ భక్తిని, విశ్వాసాన్ని నిరూపించుకోవడంతో ఈ కొలుపు ఘట్టం ముగిస్తుంది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :