Friday, 19 June 2026 01:40:03 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

మీసేవ సేవల అమలులో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలి – ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు

Date : 12 June 2026 04:08 PM Views : 57

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : ప్రజలకు మీసేవ ద్వారా అందిస్తున్న సేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ విధానాల అమలుపై ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు అధికారులకు అవగాహన కల్పించారు. శుక్రవారం కొత్తగూడెం తహసీల్దార్ పుల్లయ్య ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జీపీఓలు, ఆర్‌ఐలు, మీసేవ వీఎల్‌ఈలు, సెక్షన్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైదేశ్వరరావు మాట్లాడుతూ ఆదాయ, కుల, నివాస, కుటుంబ సభ్యుల ధృవపత్రాలు, ఈబీసీ, ఓబీసీ తదితర సేవలకు సంబంధించిన మీసేవ దరఖాస్తుల పరిశీలన పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే నిర్వహించబడుతుందని తెలిపారు. దరఖాస్తుదారులు సమర్పించిన డిజిటల్ పత్రాలను మాత్రమే పరిశీలించి నిబంధనల మేరకు ఆమోదం లేదా తిరస్కరణ నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. భౌతిక పత్రాలను స్వీకరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన GPOs & MRIs వెరిఫికేషన్ మొబైల్ అప్లికేషన్ వినియోగంపై అధికారులకు ప్రత్యేక శిక్షణ అందించారు. ఈ యాప్ ద్వారా దరఖాస్తుల పరిశీలనను సులభతరం చేసి నిర్ణీత గడువులోగా పరిష్కరించవచ్చని వివరించారు. ప్రతి దరఖాస్తును నిష్పక్షపాతంగా పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని సూచించారు. మీసేవ కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వం నిర్ణయించిన రుసుములను మాత్రమే వసూలు చేయాలని, అదనపు రుసుములు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. దరఖాస్తుల నమోదు సమయంలో వివరాలను కచ్చితంగా నమోదు చేయడంతో పాటు డేటా ఎంట్రీలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో అధికారులు, మీసేవ కేంద్రాల నిర్వాహకులు సమన్వయంతో పనిచేయాలని, సాంకేతిక లేదా పరిపాలనా సమస్యలు ఎదురైతే సంబంధిత తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో జీపీఓలు, ఆర్‌ఐలు, మీసేవ వీఎల్‌ఈలు, సెక్షన్ అధికారులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :