తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా కేంద్ర గ్రంథాలయం భద్రాద్రి కొత్తగూడెం నందు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నాలుగవ రోజు కూడా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వకృత్వ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పి స్వప్న మహిళా కళాశాల తెలుగు అధ్యాపకురాలు వివిధ పాఠశాలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులకు పోటీని నిర్వర్తించడం అయినది ఈ కార్యక్రమంలో జూనియర్స్ విభాగంలో అంశము:-చరవాణి ఉపయోగాలు నష్టాలు, సీనియర్స్ విభాగం అంశం:- మత్తు పదార్థాల వినియోగం వలన జరుగు నష్టాలు, అనే అంశాల పైన వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో గ్రంథపాలకురాలు జీ మణి మృదుల గ్రంథ పాలకుడు మధుబాబు, వాణి గ్రంథాలయ సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాఠకులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ