Sunday, 02 August 2026 04:55:17 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో ప్రత్యేక నాకాబందీ నిర్వహించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు

Date : 23 July 2026 05:13 PM Views : 834

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, నేరాల నివారణ, రోడ్డు భద్రతే లక్ష్యంగా విస్తృత తనిఖీలు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం 08.00 గంటల నుండి 10.00 గంటల వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ఏకకాలంలో ప్రత్యేక నాకాబందీ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా ప్రతిష్టమైన ప్రణాళికతో వాహన తనిఖీలు,డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు, పాత నేరస్తులను కనుగొనడానికి ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా తనిఖీలు చేపట్టడం జరిగిందని తెలియజేశారు.గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టడం,రోడ్డు ప్రమాదాలను నివారించడంలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను చేపట్టడం,పాత నేరస్తులను కనిపెట్టే విధంగా ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా ప్రతి ఒక్కరి వేలిముద్రలను తనిఖీలు చేయడం జరిగిందని అన్నారు జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్ డివిజన్ల పరిధిలోని ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారులు, ముఖ్య రహదారులు, గ్రామాల్లో ఈ నాకాబందీ నిర్వహించబడిందన్నారు. ఈ ప్రత్యేక తనిఖీలలో మొత్తం 3714 వాహనాలను తనిఖీ చేశారు. వీటిలో 2384 ద్విచక్ర వాహనాలు, 987 నాలుగు చక్రాల వాహనాలు, 434 లారీలు ఉన్నాయి. తనిఖీల సందర్భంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన 510 మంది, నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేసిన లేదా నంబర్ ప్లేట్ లేని 308 వాహనాలు, హెల్మెట్ ధరించని 524 మంది, సీటు బెల్ట్ ధరించని 106 మంది, మైనర్లు నడిపిన 14 వాహనాలు, అక్రమంగా సైలెన్సర్ మార్పులు చేసిన 4 వాహనాలను గుర్తించారు. ఈ తనిఖీల్లో 07 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను నమోదు చేసినట్లు వెల్లడించారు. అలాగే 15 అనుమతి లేని వాహనాలను స్వాధీనం చేసుకోగా, తనిఖీల్లో చోరీకి గురైన ద్విచక్ర వాహనాని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 7 ద్విచక్ర వాహనాలను సీజ్ చేయడం జరిగింది. నిబంధనలు ఉల్లంఘించిన వారి వాహనాలపై 764 స్పాట్ చల్లనలను విధించగా, 1567 వాహనాల నుండి జరిమానా వసూలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ మాట్లాడుతూ ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్, సీటుబెల్ట్ ధరించాలని, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్‌తోనే వాహనాలు నడపాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని హెచ్చరించారు. జిల్లాలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం ఇటువంటి ప్రత్యేక నాకాబందీ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. అలాగే అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు లేదా అసాంఘిక కార్యకలాపాల గురించి సమాచారం తెలిసిన వెంటనే సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :