తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగం వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ చూసి ఆదునిక సాంకేతిక పరిజ్ఞానం తో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెలుసుకునే అవకాశం ఉంది.రైతులు కాలానుగుణంగా మారి అధిక దిగుబడులు వైపు సాగు పద్ధతులు ఉండేలా రైతులను సాంకేతికంగా చైతన్యం చేయడం కోసం పెద్ద నగరాలకే పరిమితమైన ఆగ్రీ టెక్నాలజీ ఎక్స్ పో ఏజెన్సీ ప్రాంతమైన కొత్తగూడెం లో ఏర్పాటు చేసినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ....వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యంత్ర పరికరాలు మేలైన విత్తనాలు ప్రదర్శన తో పాటు సుస్థిర వ్యవసాయం సేంద్రీయ వ్యవసాయం ఉద్యాన పంటల ప్రదర్శన మత్స్య పాడి పశువుల ప్రదర్శన ఏర్పాటు . రేపు ప్రజాపాలన వేడుకలు అనంతరం వ్యవసాయ సాంకేతిక ప్రదర్శన కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతాంగానికి పిలుపు ఇచ్చారు.
Admin
తెలుగు వెలుగు టీవీ