తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ మరణం పార్టీకి పూడ్చలేని లోటని సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్ అన్నారు. గురువారం సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో వర్ధంతి నిర్వహించి పోటు ప్రసాద్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం చండ్ర నరేంద్ర కుమార్ మాట్లాడుతూ కార్మిక వర్గ బలోపేతం కోసం కార్మిక సమస్యల పైన పెద్ద ఎత్తున కార్మిక పోరాటాలకు నాయకత్వం వహించారు. పార్టీ విస్తరణలో తన కృషి మరవలేనిదని వారి మరణం కమ్యూనిస్టు ఉద్యమాలకు తీరనిలోటని వారి ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు గుండెపోటుకు గురై మృతి చెందారు వారి మరణ వార్త దిగ్ర్భాంతికి గురిచేసింది ఈ నేపథ్యంలో సిపిఐ జూలూరుపాడు మండల డి సమితి పక్షాన ఒక ప్రకటనలో పోటు ప్రసాద్ మృతికి సంతాపాన్ని వారి కుటుంబ సబ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేశారు. ఉద్యమాలపై రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాల్లో పోరాటాల్లో కలిసి పనిచేశారని గుర్తు చేశారు. సంతాపం ప్రకటించిన వారిలో సిపిఐ మండల కార్యదర్శి గుండే పిన్ని వెంకటేశ్వర్లు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి sk నాగుల్ మీరా, సిపిఐ మండల సహాయ కార్యదర్శి sk చాంద్ పాషా, యలంకి మధు, Baba మాల సామేలు, నిమ్మటూరి లచ్చయ్య, గార్లపాటి శివకృష్ణ, కంచర్ల రాఘవేంద్రరావు, మహేష్, లక్ష్మయ్య, వెంకటేశ్వర్లు, తదితరులు నివాళులర్పించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ