తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాడి పంటల పండుగ, సంక్రాంతి పండుగ.మోడ్రన్ ఇఖ్రా పాఠశాలలో ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు : కరస్పాండెంట్ షేక్ అబ్దుల్ బాసిత్. సంక్రాంతి థార్మిక పండుగ కాదని, పాడి పంటల పండుగ, రైతుల పండుగ అని కులమతాలకు అతీతంగా మనందరి పండుగ అని స్థానిక భద్రాద్రి కొత్త గూడెం జిల్లా రామవరం లోని సుభాష్ చంద్రబోస్ నగర్ లోని మోడ్రన్ ఇఖ్రా స్కూల్ కరస్పాండెంట్ షేక్ అబ్దుల్ బాసిత్ అన్నారు.సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ రోజు పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ రైతే దేశానికి వెన్నెముక అని, అన్న ప్రదాత అని అలాంటి రైతులు పంట చేతికి వచ్చాకా ఆ పై వాడికి కృతజ్ఞతలు తెలిజేస్తూ జరుపుకునే పండుగ సంక్రాంతి అని అన్నారు.రైతులు సంతోషం గా ఉంటేనే మనమంతా సుఖసంతోషాలతో ఉంటామని , అలాంటి రైతన్నల పండుగ సంక్రాంతి కులమతాలకు అతీతంగా గౌరవించాలి కోరారు. మన సంతోష సమయంలో మనకు అన్నం పెట్టే రైతన్నను జ్ఞాపకం చేసుకోవాలని, వీలైతే ఒక్కరి కన్న సహాయం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు తెలుగు ఇంగ్లీషు హిందీ భాషల్లో రైతు గొప్పదనాన్ని, పండుగ విశిష్టత లను, తెలుపుతూ చేసిన ప్రసంగాలు ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో ప్రధాన అధ్యాపకురాలు పర్వీన్ సుల్తానా, ఉపాధ్యాయురాళ్ళు లక్ష్మీ ప్రసన్న, నీలా, అనితా, సరస్వతీ, శిరీషా, నసరత్ , నాజియా, సల్మా, జేఫీషా, లతీఫా, ఖాజా.తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ