Wednesday, 16 September 2026 05:48:04 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

రాజ్యాధికారం దక్కే వరకు విశ్రమించొద్దు : రిటైర్డ్ జీఎం శనగ వెంకటేశ్వర్లు

Date : 19 August 2024 05:56 PM Views : 493

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : * భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ, ఆగస్టు 19 (తెలుగు వెలుగు) బహుజనులకు రాజ్యాధికారం దక్కే వరకు విశ్రమించొద్దని సింగరేణి రిటైర్డ్ జీఎం శనగ వెంకటేశ్వర్లు అన్నారు.సోమవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రాజకీయ శిక్షణ తరగతులకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రతీ గ్రామానికి,ప్రతీ ఇంటికి బీఎస్పీని చేరువ చేసేందుకు ప్రతీ కార్యకర్త సైనికుడిలా పని చేయాలన్నారు.బూటకపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్రంలోని జాయింట్ సెక్రటరీ,డైరెక్టర్ మరియు డిప్యూటీ సెక్రటరీ వంటి 45 ఉన్నత పోస్టులపై డైరెక్టుగా లెటరల్ ఎంట్రీ ద్వారా రిక్రూట్ మెంట్ నిర్ణయం సరైంది కాదని తద్వారా డైరెక్ట్ రిక్రూట్ మెంట్ అయిన వారికి ప్రమోషన్ లో అన్యాయం జరుగుతుందని,దీనితో పాటు ఎస్సీ,ఎస్టీ మరియు బీసీ వర్గాలకు చెందిన వ్యక్తులకు ఈ ప్రభుత్వ నియామకాల్లో వారి కోటాను నిష్పత్తిలో నియామకం ఇవ్వకపోతే అది నేరుగా రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందన్నారు. మరియు ఈ ఉన్నత పదవులను ఎటువంటి నియమాలు లేకుండా ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయడం బిజెపి ప్రభుత్వం యొక్క ఏకపక్షంగా ఉంటుందని ఇది చట్ట విరుద్ధం మరియు రాజ్యాంగ విరుద్ధం అవుతుందన్నారు.ఈకార్యక్రమంలో పాల్గొన్న బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ మాట్లాడుతూ ఈనెల 21వ తేదీన జరగబోవు భారత్ బంద్ లో ఎస్సీ,ఎస్టీ,బీసీ మరియు మతమైనార్టీలైన బహుజనులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంధం మల్లికార్జునరావు,జిల్లా మహిళా కన్వీనర్ యెర్రంశెట్టి రాజేశ్వరి,కోళ్లపూడి ప్రవీణ్,వినయ్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :