Wednesday, 16 September 2026 10:39:50 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

ప్రధానోపాధ్యాయులు ప్రభుత్వ విద్యారంగానికి మూల స్తంభాలు... జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

Date : 23 May 2025 07:28 PM Views : 455

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రధానోపాధ్యాయులు ప్రభుత్వ విద్యా రంగాన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాలని, వారు పాఠశాల నాయకులుగా ఉపాధ్యాయులకు అకాడమిక్ మార్గదర్శకత్వం వహిస్తూ విద్యార్థిని విద్యార్థుల పట్ల సానుకూల దృక్పథంతో ఉంటూ నాణ్యమైన విద్యను పిల్లలకి అందించడంలో నిజమైన నాయకులుగా ఎదగాలని సూచించారు. కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణా కేంద్రంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ప్రధానోపాధ్యాయుల వృత్యంతర శిక్షణా కార్యక్రమాన్ని సందర్శించిన ఆయన మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులు మనసుపెట్టి పనిచేస్తే సాధించలేని కార్యం ఏది ఉండదని, పాఠశాలలో సమాజ భాగస్వామ్యం పెంచుతూ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంలో తమ పాత్ర పోషించాలని కోరారు. అంతకుముందు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాత పాల్వంచలో జరుగుతున్న జీవశాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని సందర్శించి మనుషుల నివాసానికి అనుకూలమైన ఈ భూగ్రహాన్ని రక్షించడంలో జీవశాస్త్ర ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని జీవశాస్త్రం చదవటం అంటే కేవలం డాక్టర్ గా స్థిరపడటం అనే ఒక అపోహ నుండి బయటపడి ఎన్నో వినూత్నమైన కోర్సులను అధ్యయనం చేస్తూ మానవాళికి అవసరమైన సహజ సిద్ధమైన ఆహార పదార్థాలను మొక్కల ద్వారా అందించడం ఒక ప్రధాన బాధ్యతగా తీసుకోవాలని కోరారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను తరగతి గదిలో వినియోగించి విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందించాలని ఉద్భోదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఏ. నాగరాజశేఖర్, జీవశాస్త్ర శిక్షణా కేంద్ర ఇంచార్జ్ ఏ. పద్మలత, రాష్ట్ర పరిశీలకులు శ్రీహరి, రిసోర్స్ పర్సన్లు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :