తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఒలింపిక్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ యుగంధర్ రెడ్డి,జే.బీ.పీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ జిల్లాకే తలమానికంగా రాజేందర్ మెమోరియల్ యూత్(ఆర్. జే.ఎమ్) ఉందని జిల్లా ఒలింపిక్స్ అధ్యక్షులు డాక్టర్ యుగంధర్, జే.బీ.పీ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు యెర్రా కామేష్ లు అన్నారు.పట్టణంలోని ప్రగతి మైదానంలో గత 15 రోజులుగా జరుగుతున్న భద్రాద్రి కొత్తగూడెం ప్రీమియం లీగ్ (బి.కే.పి.ఎల్) క్రికెట్ టోర్నమెంట్ మంగళవారం ఫైనల్ తో ముగిసింది.ఫైనల్ మ్యాచ్ లో ఫ్రెండ్స్ లెవల్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 89 పరుగులు సాధించి 90 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆర్.జే.ఎమ్ జట్టుపై ఉంచింది తర్వాత బ్యాటింగ్ చేసిన ఆర్.జే.ఎమ్. జట్టులోని మధు,ప్రభు చూడచక్కని షాట్లతో స్కోర్ వేగాన్ని పెంచారు.చివర్లో సాయి,చందు సిక్సర్ లతో విరుచుకుపడడంతో విజయ లక్ష్యం సునాయాసం అయింది.ఫైనల్ లో గెలుపొందిన ఆర్.జే.ఎమ్ జట్టు సభ్యులకు ఒలంపిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ యుగంధర్ రెడ్డి,జే.బీ.పీ పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు కప్పును అందజేశారు.మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు 2 ఓవర్లు వేసి 3 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసిన కుమార్ అందుకున్నాడు.ఈ సంధర్భంగా కామేష్,యుగంధర్ లు మాట్లాడుతూ రాష్ట్ర నలుమూలల జరుగుతున్న క్రికెట్ పోటీల్లో ఆర్.జే.ఎమ్. జట్టు పాల్గొంటూ విజయాలను తన ఖాతాలో వేసుకోవడం అభినందనీయమన్నారు,క్రికెట్ జట్టులో 11మంది క్రీడాకారులు సమిష్టిగా అడినప్పుడే అవతలి జట్టును ఓడించి విజయం సాధిస్తారని అన్నారు.గత15 రోజులుగా నిర్విరామంగా పోటీలు జరుగగా ఎలాంటి బేధాభిప్రాయాలు లేకుండా తోడ్పాటు అందించిన అన్ని జట్లకు,టోర్నమెంట్ నిర్వాహకులు హరీష్ కు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఒలింపిక్స్ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరావు,బండి భాస్కర్,మండల శీను,లింగేష్,పొన్నం అజయ్,శివ,కిరణ్,మేకల శేఖర్,వినయ్,సమీర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ