తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఏరియ రుద్రంపుర్ ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్ నందు సింగరేణి ఆధ్వర్యంలో జరుగు కోల్ ఇండియా ఇంటర్ కంపెనీ కబడ్డీ పోటీల ప్రారంభోత్సవ వేడుకకు హాజరైన గుర్తింపు సంఘం ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి కొరిమి రాజకుమార్ మాట్లాడుతూ అన్ని ఏరియాల్లో క్రీడాకారులకు కబడ్డీ ప్రాక్టీస్ చేసుకునేవిధంగా సింతటిక్ కోర్టు ఏర్పాటుచేయాలని కోరారు,అదేవిధంగా కబడ్డీ,హాకీ, క్రికెట్ లాంటి పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు ఒకవేళ గాయాలపాలయ్యితే వారికి యాజమాన్యం వేతనం ఆలస్యంగా చెల్లించడంవల్ల కుటుంబంలో ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వారికి ప్రతినెల వేతనం యాజమాన్యం త్వరగా చెల్లించాలని డిమాండ్ చేశారు,మరియు సింగరేణి యాజమాన్యం అన్ని ఏరియాల్లో స్పోర్ట్స్ సూపర్వైజర్స్ ను నియమించాలని కోరారు,పాల్గొన్న 8 కోల్ మైన్స్ కంపెనీ క్రీడాకారుల,క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొని మంచి ఫలితాలు సాధించాలిని కోరుతూ వారికి శుభాకాంక్షలు తెలిపారు, ఈ కార్యక్రమం లో ఎఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి వి.మల్లికార్జునరావు, జె.గట్టయ్య,వీరస్వామి,కత్తర్ల రాములు, సందబోయిన శ్రీనివాస్,మధు కృష్ణ,కమల్,తాతిదారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ