Sunday, 02 August 2026 06:46:59 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

భగీరథ పనులను పరిశీలించిన సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె షాబీర్ పాష ,ప్రతినిధి బృందం

Date : 09 April 2026 04:32 PM Views : 254

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రామవరం ప్రాంతానికి యుద్ధ ప్రాతిపదికన మంచి నీళ్లు అందించాలి మిషన్ భగీరథ పట్ల అధికారులు అలసత్వాన్ని వీడాలి భగీరథ పనులను పరిశీలించిన సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె షాబీర్ పాష ,ప్రతినిధి బృందం కార్పొరేషన్ పరిధిలోని రామవరం ప్రాంతంలో ఉన్న నీటి ఎద్దడి నివారించేందుకు చర్యలు తీసుకొని యుద్ధ ప్రాతిపదికన మంచినీళ్లు అందించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా అధికారులకు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం రామవరం లోని కిన్నెరసాని ,భగీరథ పనుల పైప్ లైన్లను, నూతన ట్యాంకులను పరిశీలించి ఆయన మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు 125 కోట్లతో మిషన్ భగీరథ పథకాన్ని మంజూరు చేయించి ప్రజలు మంచినీళ్లకు బాధపడొద్దని కృత నిశ్చయంతో చేసిన పనులకు అధికారుల అలసత్వం ద్వారా పనులు జాప్యం అవుతున్నాయని అన్నారు. తక్షణమే మిషన్ భగీరథ పనులను పూర్తి చేసి నూతన ట్యాంక్ కి నీళ్లు ఎక్కించి రామవరం లో నీటి ఎద్దడి లేకుండా చూడాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధికారులకు ఫోన్లో ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే పాత కిన్నెరసాని ట్యాంక్ ద్వారా సాయంత్రానికి నీళ్లు అందించాలని అధికారులకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. అలాగే స్టాండ్ బై మోటార్లను ఏర్పాటు చేసుకొని మంచినీటి సరఫరా లో అవాంతరాలు ఏర్పడకుండా చూసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు .అలాగే పైప్ లైన్ జరుగుతున్న ప్రాంతాల్లో శిథిలమైన రోడ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అసౌకర్యం లేకుండా చూడాలని మిషన్ భగీరథ అధికారులను ఆయన ఆదేశించారు పనులను పరిశీలించిన సిపిఐ ప్రతినిధి బృందంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు, జిల్లా కౌన్సిల్ సభ్యులు భూక్య శ్రీనివాస్, రామవరం బ్రాంచ్ కార్యదర్శి మర్రి గోపి, త్రీ టౌన్ టౌన్ ఏరియా కార్యదర్శి యూసుఫ్, 14,16,17 వ డివిజన్ కార్పొరేటర్స్ సుధాకర్ రాజు, మునిగడప పద్మ, ఎర్రబెల్లి శంకర్, సీనియర్ నాయకులు మాటేటి గోపాల్, సర్పంచ్ నగేష్, రమేష్, అంకుష్ గంటాడి కోటేశ్వరరావు, ఖంపెల్లి దుర్గయ్య, నాగరాజు, శివ ,రాజు ,జగ్గు, చందు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :