Sunday, 02 August 2026 02:26:53 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

ఏఐటీయూసీ సమ్మె నోటీసుపై ఆర్ ఎల్ సి సమక్షంలో యాజమాన్యంతో రెండో విడత చర్చలు.

Date : 28 July 2026 07:09 PM Views : 381

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఏఐటీయూసీ సమ్మె నోటీసుపై ఆర్ ఎల్ సి సమక్షంలో యాజమాన్యంతో రెండో విడత చర్చలు.మెడికల్ బోర్డుపై ఏఐటీయూసీ వాదనకు స్పందించిన ఆర్‌ఎల్‌సీ. రీ-మెడికల్ పరిశీలించాలని యాజమాన్యానికి సూచన.ఆగస్టు 6లోగా సమస్యలు పరిష్కారం కాకపోతే ఆగస్టు 16 నుంచి అన్ని సంఘాలను కలుపుకొని సమ్మెకు వెళ్తాం: ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ వెల్లడి.సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఇచ్చిన సమ్మె నోటీసుపై మంగళవారం హైదరాబాద్‌లో కేంద్ర కార్మిక శాఖ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ డా. సస్వతీ రాథ్ సమక్షంలో రెండో విడత చర్చలు జరిగాయి.ఏఐటీయూసీ తరఫున అధ్యక్షులు వి. సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కె. రాజ్‌కుమార్, అదనపు ప్రధాన కార్యదర్శి ఎం. రంగయ్య, ఉప ప్రధాన కార్యదర్శులు కె. వీరభద్రయ్య, వై.వి. రావు, ఎం.సమ్మయ్య పాల్గొన్నారు. సింగరేణి యాజమాన్యం తరఫున డిప్యూటీ జనరల్ మేనేజర్ (పర్సనల్) బి. రాజగోపాల్ హాజరయ్యారు.సమ్మె నోటీసులో ప్రధాన డిమాండ్‌గా ఉన్న మెడికల్ బోర్డు అంశంపై యాజమాన్యం ఇప్పటికే బోర్డు నిర్వహించామని తెలిపింది. అయితే, బోర్డు ద్వారా పరీక్షించిన కార్మికులను పారదర్శకంగా ఫిట్ లేదా అన్‌ఫిట్‌గా ప్రకటించకపోవడంతో అనేక మంది కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఏఐటీయూసీ వాదించింది.వాదనలను విన్న అసిస్టెంట్ లేబర్ కమిషనర్,ఈనెల 17,18 మెడికల్ బోర్డులో పరీక్షించిన కార్మికులకు రీ-మెడికల్ పరీక్ష నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని యాజమాన్యానికి సూచించారు.భవిష్యత్తులో ఇలాంటి వివాదాలకు తావులేకుండా మెడికల్ బోర్డులను క్రమం తప్పకుండా నిర్వహించాలని కూడా స్పష్టం చేశారు.అదేవిధంగా, తదుపరి చర్చలకు ముందే యాజమాన్యం, ఏఐటీయూసీ మధ్య ద్వైపాక్షిక సమావేశం నిర్వహించి సమ్మె నోటీసులో పేర్కొన్న అన్ని డిమాండ్లపై సానుకూలంగా చర్చించి, ఆ సమావేశ నివేదికను తదుపరి విచారణలో సమర్పించాలని ఆర్ ఎల్ సి ఆదేశించారు.ఇరు పక్షాలు పరస్పర చర్చల ద్వారానే సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించిన అసిస్టెంట్ లేబర్ కమిషనర్, తదుపరి విచారణకు నిర్ణయాధికారం కలిగిన అధికారిని యాజమాన్యం తప్పనిసరిగా హాజరుపరచాలని స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో తదుపరి చర్చలను ఆగస్టు 6, 2026 ఉదయం 11 గంటలకు వాయిదా వేసినట్టు తెలిపారు.అనంతరం ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ, ఆగస్టు 6న జరిగే చర్చల్లో సమస్యలకు సానుకూల పరిష్కారం లభించకపోతే ఆగస్టు 16 నుంచి సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని నిరవధిక సమ్మెకు దిగుతామని వాసిరెడ్డి సీతారామయ్యా,కొరిమి రాజ్ కుమార్ స్పష్టం చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :