తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : స్థానిక కొత్తగూడెం జిల్లా కేంద్ర లోని మొహమ్మద్ రజాబ్ అలీ భవన్ లో నిర్వహించిన ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు sk షాహిద్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈసందర్బంగా AISF జిల్లా కార్యదర్శి వరక అజిత్ మాట్లాడుతు రాష్ట్రంలో గత 7 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 11000 వేల కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కళాశాల యాజమాన్యాలు పిలుపునిచ్చిన. రాష్ట్రవ్యాప్త కళాశాలల బంద్కు ' అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు AISF భద్రద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వరక అజిత్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో వున్నా స్కాలర్షిప్ ఫీజు రియాంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయక పోవడం వాళ్ళ కళాశాలల నిర్వహణ భారంగా మారడమే కాకుండా, లక్షలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకినెట్టివేయబడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్కాలర్షిప్లు అందక విద్యార్థులు పై చదువులకు దూరమయ్యే పరిస్థితి ఉందని ప్రభుత్వం ఇప్పటికైనా మొండివైఖరి వీడి పెండింగ్ లో ఉన్నటు వంటి బకాయిల సమస్యను పరిష్కరించకపోతే విద్యార్థులు, యాజమాన్యాలతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ బంద్ కార్యక్రమంలో విద్యార్థులు, మేధావులు, పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి మాణిక్యాల వినయ్, మర్మం ఉమా మహేశ్వర్, జిల్లా ఉపాధ్యక్షులు కొరిమి సంజయ్, జిల్లా సహాయ కార్యదర్శి శ్యామల, హాసిని, స్వరాంజలి, సాత్విక తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ