Monday, 03 August 2026 10:40:44 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

ఐఎన్టీసీ నాయకులు జన ప్రసాద్ తప్పుడు మాటలు మాట్లాడడం సరైన పద్ధతి కాదు : టీబీజీకేఎస్ చీప్ జనరల్ సెక్రెటరీ కాపు కృష్ణ

Date : 08 February 2025 06:55 PM Views : 1150

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : టీబీజీకేఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పైన ఐఎన్టీసీ నాయకులు జన ప్రసాద్ తప్పుడు మాటలు మాట్లాడడం సరైన పద్ధతి కాదు టీబీజీకేస్ అధ్యక్షురాలిగా ఎన్నికైన నాటినుండికల్వకుంట్ల కవిత సింగరేణి కార్మికులకు మాజీ సీఎం కేసీఆర్ తో మాట్లాడి అనేక హక్కులు తీసుకురావడం జరిగింది. సకలజనుల సమ్మె కాలానికి సమ్మె చేసి నష్టపోయిన జీతం తిరిగి చెల్లించడం. తెలంగాణ ఇంక్రిమెంట్ ఇవ్వడం, 3200 పెండింగ్ లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాలు ఒకే దఫా ఉద్యోగం ఇప్పించడం, కరెంటు కటింగు వన్ పర్సెంట్ కోలిండియాలో లేనివిధంగా నిలుపుదల చేయడం, కోలిండియాలో లేని విధంగా మ్యాచ్ గ్రాంట్ పదికి పది లక్షల కలిపి ఇవ్వడం, గతంలో ఉన్న యూనియన్లు ఏసీ కోసం 1500 రూపాయలు కరెంట్ బిల్లు కడతామంటే ఒప్పుకొని యాజమాన్యం టీబీజీకేఎస్ అధ్యక్షులు చొరవతో ఉచితంగా ఏసీలకు కరెంటు ఇవ్వడం జరిగింది. కోలిండియాలో లేని తండ్రులకు కార్పొరేట్ వైద్యం కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టే విధంగా చేయడం జరిగింది. వృత్తి పన్ను 1%ను శాశ్వతంగా రద్దు చేయడం జరిగింది. ప్రాఫిట్ బోనస్ 16% ఉన్నదానిని 32% వరకు మొత్తం నికర లాభంలో నుండి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడున్న యూనియన్స్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా 4700 కోట్ల నుండి 2289 కోట్లు పక్కనపెట్టి 16.7% గా 2411కోట్లను పంచడం జరిగింది. ఐ ఎన్ టియూసి గోల్డెన్ హ్యాండ్ షేక్ పేరు మీద కార్మికులకు 4000రూపాయలు చొప్పున ఇచ్చి

దాదాపు 10,000మంది కార్మికులను తీసివేసి వారి పొట్ట కొట్టడం జరిగింది. ఇటువంటి గొప్ప ఘన కీర్తి కలిగిన ఐఎన్టిసి యూనియన్ నాయకులు టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ని మిర్యాల రాజి రెడ్డి ని పైన తప్పుడు మాటలు మాట్లాడటం ఎంతవరకు సమంజసం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇటువంటి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు రాబోయే ఎలక్షన్లలో కార్మికులే బుద్ధి చెప్తారు మీకు. జాతీయ సంఘాo అని చెప్పుకుంటుంటారు కోల్ ఇండియాలో మీకు ప్రాతినిధ్యం ఎక్కడిది. యూనియన్ ఎలక్షన్ల ముందు అనేక వాగ్దానాలు చేశారు 250 గజాల ఇంటి స్థలం ఇప్పిస్తానన్నారు,20 లక్షల వడ్డీ లేని రుణము ఇస్తానన్నారు, పెర్క్స్ మీద ఇన్కంటాక్స్ రద్దు చేపిస్తా మన్నారు అన్నారు 14 నెలల కాలంలో కార్మికులకు ఒక్క హక్కు కూడా సాధించి పెట్టలేదు. 35 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలు చేసింది మేము చేసినమని చెప్పుకుంటున్నారు ఎలక్షన్ల ముందు అన్ని యూనియన్లు సంతకాలు పెట్టి అగ్రిమెంట్ చేసుకున్న హక్కుని మీరు చేసినట్టుగా చెప్పుకోవడం సిగ్గుచేటు. మేము ఒకే పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళం మా నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది మాకు ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వద్దని వారి మీద నమ్మకంతో మేము పనిచేస్తూ వెళ్తాము. మీ పార్టీని నమ్ముకున్న వాళ్లకు మీరు ఏం చేశారో కార్మికులందరికీ తెలుసు.ఈ సమావేశంలో కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య , కార్పొరేట్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ తుమ్మ శ్రీనివాస్ సెంట్రల్ కమిటీ మెంబర్స్ రా సూరి శంకర్, కాగితపు విజయ్ కుమార్,మీసాల మురళి,అశోక్,రవి వర్మ,సూర్యనారాయణ, సూరజ్ రాజకుమార్,తిరుపతి,అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :