Saturday, 19 September 2026 01:32:58 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

ఐఎన్టీసీ నాయకులు జన ప్రసాద్ తప్పుడు మాటలు మాట్లాడడం సరైన పద్ధతి కాదు : టీబీజీకేఎస్ చీప్ జనరల్ సెక్రెటరీ కాపు కృష్ణ

Date : 08 February 2025 06:55 PM Views : 1185

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : టీబీజీకేఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పైన ఐఎన్టీసీ నాయకులు జన ప్రసాద్ తప్పుడు మాటలు మాట్లాడడం సరైన పద్ధతి కాదు టీబీజీకేస్ అధ్యక్షురాలిగా ఎన్నికైన నాటినుండికల్వకుంట్ల కవిత సింగరేణి కార్మికులకు మాజీ సీఎం కేసీఆర్ తో మాట్లాడి అనేక హక్కులు తీసుకురావడం జరిగింది. సకలజనుల సమ్మె కాలానికి సమ్మె చేసి నష్టపోయిన జీతం తిరిగి చెల్లించడం. తెలంగాణ ఇంక్రిమెంట్ ఇవ్వడం, 3200 పెండింగ్ లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాలు ఒకే దఫా ఉద్యోగం ఇప్పించడం, కరెంటు కటింగు వన్ పర్సెంట్ కోలిండియాలో లేనివిధంగా నిలుపుదల చేయడం, కోలిండియాలో లేని విధంగా మ్యాచ్ గ్రాంట్ పదికి పది లక్షల కలిపి ఇవ్వడం, గతంలో ఉన్న యూనియన్లు ఏసీ కోసం 1500 రూపాయలు కరెంట్ బిల్లు కడతామంటే ఒప్పుకొని యాజమాన్యం టీబీజీకేఎస్ అధ్యక్షులు చొరవతో ఉచితంగా ఏసీలకు కరెంటు ఇవ్వడం జరిగింది. కోలిండియాలో లేని తండ్రులకు కార్పొరేట్ వైద్యం కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టే విధంగా చేయడం జరిగింది. వృత్తి పన్ను 1%ను శాశ్వతంగా రద్దు చేయడం జరిగింది. ప్రాఫిట్ బోనస్ 16% ఉన్నదానిని 32% వరకు మొత్తం నికర లాభంలో నుండి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడున్న యూనియన్స్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా 4700 కోట్ల నుండి 2289 కోట్లు పక్కనపెట్టి 16.7% గా 2411కోట్లను పంచడం జరిగింది. ఐ ఎన్ టియూసి గోల్డెన్ హ్యాండ్ షేక్ పేరు మీద కార్మికులకు 4000రూపాయలు చొప్పున ఇచ్చి

దాదాపు 10,000మంది కార్మికులను తీసివేసి వారి పొట్ట కొట్టడం జరిగింది. ఇటువంటి గొప్ప ఘన కీర్తి కలిగిన ఐఎన్టిసి యూనియన్ నాయకులు టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ని మిర్యాల రాజి రెడ్డి ని పైన తప్పుడు మాటలు మాట్లాడటం ఎంతవరకు సమంజసం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇటువంటి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు రాబోయే ఎలక్షన్లలో కార్మికులే బుద్ధి చెప్తారు మీకు. జాతీయ సంఘాo అని చెప్పుకుంటుంటారు కోల్ ఇండియాలో మీకు ప్రాతినిధ్యం ఎక్కడిది. యూనియన్ ఎలక్షన్ల ముందు అనేక వాగ్దానాలు చేశారు 250 గజాల ఇంటి స్థలం ఇప్పిస్తానన్నారు,20 లక్షల వడ్డీ లేని రుణము ఇస్తానన్నారు, పెర్క్స్ మీద ఇన్కంటాక్స్ రద్దు చేపిస్తా మన్నారు అన్నారు 14 నెలల కాలంలో కార్మికులకు ఒక్క హక్కు కూడా సాధించి పెట్టలేదు. 35 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలు చేసింది మేము చేసినమని చెప్పుకుంటున్నారు ఎలక్షన్ల ముందు అన్ని యూనియన్లు సంతకాలు పెట్టి అగ్రిమెంట్ చేసుకున్న హక్కుని మీరు చేసినట్టుగా చెప్పుకోవడం సిగ్గుచేటు. మేము ఒకే పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళం మా నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది మాకు ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వద్దని వారి మీద నమ్మకంతో మేము పనిచేస్తూ వెళ్తాము. మీ పార్టీని నమ్ముకున్న వాళ్లకు మీరు ఏం చేశారో కార్మికులందరికీ తెలుసు.ఈ సమావేశంలో కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య , కార్పొరేట్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ తుమ్మ శ్రీనివాస్ సెంట్రల్ కమిటీ మెంబర్స్ రా సూరి శంకర్, కాగితపు విజయ్ కుమార్,మీసాల మురళి,అశోక్,రవి వర్మ,సూర్యనారాయణ, సూరజ్ రాజకుమార్,తిరుపతి,అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :