Friday, 18 September 2026 05:14:51 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేకంగా పనిచేస్తున్న షీ టీమ్స్‌

Date : 18 September 2026 03:16 PM Views : 24

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న వేధింపులను అరికట్టేందుకు షీ టీమ్స్‌ ప్రత్యేకంగా పనిచేస్తున్నాయని షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి తెలిపారు. గురువారం ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. రాగింగ్‌, టీజింగ్‌, బ్లాక్‌మెయిలింగ్‌, తప్పుడు కాల్స్‌, అసభ్యకర మెసేజ్‌లు, బహిరంగ ప్రదేశాల్లో అసభ్యంగా ప్రవర్తించడం, తాకడం, తోయడం వంటి వేధింపులకు గురైతే మహిళలు, బాలికలు భయపడకుండా ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. బహిరంగ ప్రదేశాలు, రద్దీ ప్రాంతాలు, బస్సులు తదితర ప్రాంతాల్లో మహిళలకు భద్రత కల్పించడంతో పాటు వేధింపులకు పాల్పడే వారిపై షీ టీమ్స్‌ చర్యలు తీసుకుంటాయని తెలిపారు. సమస్య ఎదురైనప్పుడు షీ టీమ్‌ నంబర్‌కు ఫోన్‌ చేయడంతో పాటు వాట్సాప్‌ ద్వారా మెసేజ్‌, వాయిస్‌ రికార్డింగ్‌ లేదా రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లేందుకు భయపడేవారు లేదా ఇబ్బంది పడేవారి వద్దకే షీ టీమ్స్‌ చేరుకుని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాయని తెలిపారు. ఫిర్యాదుదారుల వ్యక్తిగత వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. మైనర్లు తప్పు చేసిన సందర్భాల్లో వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులను పిలిపించి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని, నేరం తీవ్రతను బట్టి కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మహిళలు, బాలలు, ఇతర బలహీన వర్గాల రక్షణ కోసం అమలులో ఉన్న పోక్సో చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, ఎస్సీ/ఎస్టీ చట్టం, సీనియర్‌ సిటిజెన్స్‌ రక్షణ చట్టం తదితర చట్టాలపై అవగాహన కల్పించారు. మహిళలు విద్యతో పాటు ఆర్థికంగా స్వావలంబన సాధించి, ఆత్మవిశ్వాసంతో జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 112కు కాల్‌ చేసి పోలీసుల సహాయం పొందాలని తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :