Monday, 03 August 2026 04:10:03 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

మణుగూరులో నూతన పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్.

Date : 06 July 2026 06:23 PM Views : 153

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మణుగూరులో నూతన పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్.ప్రజలకు మెరుగైన పోలీసు సేవలందించడమే లక్ష్యం – డీజీపీ సి.వి. ఆనంద్.జిల్లాలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడంతో పాటు ప్రజలకు ఆధునిక సౌకర్యాలతో కూడిన మెరుగైన పోలీసు సేవలు అందించాలనే లక్ష్యంతో మణుగూరులో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్‌ను తెలంగాణ రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రోహిత్ రాజు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, పోలీసు శాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ అంకిత్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ మానిటరింగ్ సెల్‌ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా డీజీపీ సి.వి. ఆనంద్ మాట్లాడుతూ, సింగరేణి సంస్థ సహకారంతో నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణం పూర్తయిందని, ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన పోలీసు సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు, హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో నేరాల నియంత్రణతో పాటు అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతూ సమర్థవంతంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా పోలీసు సేవలను మరింత సమర్థవంతంగా అందించగలుగుతున్నామని డీజీపీ తెలిపారు. నేరాల నియంత్రణ, దర్యాప్తు, సీసీటీవీ నిఘా, సైబర్ నేరాల విచారణ వంటి అంశాల్లో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందన్నారు.మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా సమాజాన్ని వినాశన దిశగా నడిపిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. భావితరాలను ఈ ప్రమాదం నుంచి కాపాడేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఇందులో భాగంగా ఈగల్ (EAGLE) వంటి ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసి, కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు సమన్వయంతో మాదకద్రవ్యాల నిర్మూలన కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. సైబర్ నేరాలు, ట్రాఫిక్ రహదారి ప్రమాదాల నివారణపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేసే ముఠాలను తీవ్రవాదుల మాదిరిగానే పరిగణిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.జిల్లా కలెక్టర్ అంకిత్ నూతన పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ మానిటరింగ్ సెల్‌ను ప్రారంభించి, పోలీస్ స్టేషన్‌లో కల్పించిన ఆధునిక మౌలిక సదుపాయాలను పరిశీలించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు సత్వర, పారదర్శక పోలీసు సేవలందించడంలో జిల్లా యంత్రాంగం పోలీసు శాఖతో సమన్వయంగా పనిచేస్తోందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా నేరాల నియంత్రణతో పాటు ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు ఈ నూతన పోలీస్ స్టేషన్ దోహదపడుతుందని పేర్కొన్నారు.అనంతరం డీజీపీ, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో కలిసి పోలీస్ స్టేషన్‌లోని వివిధ విభాగాలను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ప్రజలకు స్నేహపూర్వక, పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన పోలీసు సేవలు అందించాలని పోలీసు అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీసు శాఖ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, సింగరేణి సంస్థ ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :