Thursday, 02 July 2026 04:24:30 AM
# సింగరేణి గడ్డ మరోసారి పోరాటాల గడ్డగా మారింది. జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడి విజయవంతం.వేలాది కార్మికులతో మార్మోగిన డిమాండ్ల డే. # నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం తగదు.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాలు పేద కుటుంబాలకు కొండంత అండ. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకం ప్రయోజనాలు పారదర్శకంగా అందిస్తాం: జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి సన్మానం. # కార్మికుల న్యాయమైన వేతన హక్కులను కాలరాయొద్దు – 12వ వేతన కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి. # వట్టికొండ రజిని జయంతి సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులు, బట్టల పంపిణీ. # నూతన జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని గడువులోపు పూర్తి చేయాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్ రెడ్డి. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశీలక బృందం సందర్శించింది. # ప్రజలకు నిర్విరామంగా సేవలందించిన ఉద్యోగుల సేవలు చిరస్మరణీయం: జిల్లా కలెక్టర్ అంకిత్. # ఓటర్ల జాబితా సవరణలో బిఎల్ఏల పాత్ర కీలకం. బిఎల్ఏల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం.అరెస్టు చేసిన కూనంనేనిని, ఇతర నేతలను భేషరతుగా విడుదల చేయాలి. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం. సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఇండ్లు లేని పేదల పక్షాన సమిష్టిగా పోరాడుదాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు. # మొహరం పండుగ త్యాగానికి, సేవకు నిదర్శనం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # తల్లిదండ్రుల మందలించడంతో మనస్తాపం చెంది కొడుకు ఆత్మహత్య. # పద్ధతి మార్చుకోండి లేదంటే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు రౌడీషీటర్లకు డీఎస్పీ అరుణ్ కుమార్ కౌన్సిలింగ్. # ​ బైక్ అదుపుతప్పి కరెంట్ పోల్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో సమ్మయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి. # ప్రాచీన సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకుందాం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

గోధుమవాగు బ్రిడ్జీపై గుంతల మరమ్మత్తులు ముమ్మరం - కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్

Date : 30 June 2026 05:54 PM Views : 149

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం సరికాదు యేండ్ల తరబడి బ్రిడ్జీపై దుస్థితి నెలకొంది యుద్ధప్రాతిపదికన మరమ్మత్తు పనులను పూర్తి చేయాలి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ పట్టణపరిధిలోని రామవరం గోధుమవాగు బ్రిడ్జీపై ఏర్పడిన గుంతల మరమ్మత్తులు ముమ్మరంగా సాగుతున్నాయని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ అన్నారు. కొత్తగూడెం పరిధిలోని రామవరం గోధుమవాగు బ్రిడ్జీపై గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతోపాటు తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటుండటంతో మున్సిపల్ శాఖ ద్వారా మరమ్మత్తు పనులకు ఆదేశించారు. ఈ మేరకు మేయర్ మూడ్ గణేష్ మంగళవారం అక్కడ జరుగుతున్న మరమ్మత్తు పనులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిడ్జీపై పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడి నిత్యం ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నా నేషనల్ హైవే అధికారులు ఘోరంగా నిర్లక్ష్యం వహిస్తున్నారని, తమ భాధ్యతను విస్మరించారని అన్నారు. యేండ్ల తరబడి ఈ దుస్థితి నెలకొనడం వల్లే తాము రంగంలోకి దిగాల్సి వచ్చిందని, ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించి యుద్ధప్రాతిపదికన ఈ మరమ్మతు పనులకు ఆదేశించామని స్పష్టం చేశారు. వాహనదారులకు ఇకపై ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులను అత్యంత నాణ్యతా ప్రమాణాలతో, వేగంగా పూర్తి చేయాలని అక్కడి సిబ్బందిని ఆదేశించారు. మేయర్ వెంట కార్పొరేటర్లు కార్పొరేటర్లు బోయిన విజయ్ కుమార్, కూరపాటి సుధాకర్, జి వెంకటేశ్వర్లు, నాయకులు ఎండి యూసుఫ్, ధర్మరాజు, పి సత్యనారాయణాచారి తదితరులు వున్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :