తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాబోయే వర్షాల దృష్ట్యా సంభవించే వరదలలో ప్రమాదవశాత్తు చిక్కుకున్న భాదితులను రక్షించడానికి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 05 డీడిఆర్ఎఫ్ బృందాలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాయని ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ అన్నారు.అత్యవసర సమయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వీలుగా అన్ని శాఖలతో సమన్వయం పాటిస్తూ ముందుకెళ్తున్నామని తెలిపారు.ఇందులో భాగంగానే ఈ రోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు మరియు 6th బెటాలియన్ టీజీఎస్పి అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.జిల్లాలోని ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా శిక్షణను పొందిన డిడిఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు.ముఖ్యంగా గోదావరి నది వరదలు సంభవించినప్పుడు నదీ పరివాహక ప్రాంతాలలో నివసించే లోతట్టు ప్రాంత ప్రజలను సంరక్షించడానికి ఈ బృందాలు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని తెలియజేశారు.రెస్క్యూ సమయంలో అవసరమయ్యే లైవ్ జాకెట్స్,లైఫ్ బాయ్ రింగ్స్,బోట్ పెడల్స్,రోప్స్ మరియు ఇతర సామాగ్రి మొత్తాన్ని ఈ బృందాలకు సమకూర్చడం జరిగిందన్నారు.జిల్లాలో ఏ ప్రాంతంలో ఎలాంటి విపత్తు ఎదురైనా అక్కడి బాధితులను సంరక్షించేందుకు సమన్వయంతో అన్ని శాఖల అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.రాబోయే భారీ వర్షాల దృష్ట్యా లోతట్టు ప్రాంత ప్రజలు కూడా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.విపత్కర సమయాల్లో డయల్ 100 నకు ఫోన్ చేసి పోలీస్ వారి సేవలను వినియోగించుకోవాలని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ నరేందర్,జిల్లా అగ్నిమాపక శాఖాధికారి క్రాంతి కుమార్,6th బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ శ్రీనివాస్,ఆపరేషన్స్ ఆర్ఐ రవి మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ