Wednesday, 16 September 2026 04:45:59 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

రెండోసారి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అందుకున్న అజ్మీర సురేష్ నాయక్‌కు అభినందనలు

Date : 13 September 2026 06:59 PM Views : 66

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములు NSUI భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా నూతన బాధ్యతలు అందుకున్న అజ్మీర సురేష్ నాయక్‌కు ఘన సన్మానం NSUI భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా నూతనంగా బాధ్యతలు అందుకున్న అజ్మీర సురేష్ నాయక్‌ను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములు తన స్వగృహంలో ఘనంగా సన్మానించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాగా సీతారాములు మాట్లాడుతూ, విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ, విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్న అజ్మీర సురేష్ నాయక్‌కు వరుసగా రెండోసారి NSUI భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు లభించడం అభినందనీయమని అన్నారు. నూతన బాధ్యతల్లో ఆయన మరింత విజయవంతంగా రాణించాలని, విద్యార్థి సమస్యలపై మరింత చురుగ్గా పనిచేస్తూ NSUIకి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అజ్మీర సురేష్ నాయక్ గతంలో నిర్వహించిన బాధ్యతలను గుర్తుచేస్తూ, విద్యార్థులు మరియు యువత సమస్యలపై ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని నాగా సీతారాములు పేర్కొన్నారు. మరోసారి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం ఆయనపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని, ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో కూడా మరిన్ని ఉన్నత అవకాశాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అజ్మీర సురేష్ నాయక్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి వరుసగా రెండోసారి NSUI భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అందించిన పార్టీ పెద్దలకు, NSUI రాష్ట్ర నాయకత్వానికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనకు లభించిన ఈ బాధ్యతను ఒక పదవిగా కాకుండా విద్యార్థుల పట్ల తనకున్న బాధ్యతగా భావిస్తానని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి విద్యార్థికి అండగా నిలుస్తూ, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ, విద్యా రంగ అభివృద్ధి, యువతకు మెరుగైన అవకాశాల కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, నాయకత్వం చూపిన మార్గంలో నడుస్తూ NSUIని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరింత బలోపేతం చేయడంతో పాటు, విద్యార్థులను సంఘటితం చేసి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అజ్మీర సురేష్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా తనను ఆత్మీయంగా సన్మానించి, నూతన బాధ్యతలపై హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములు అజ్మీర సురేష్ నాయక్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం అజ్మీర సురేష్ నాయక్ కూడా నాగా సీతారాములుని,మండే.వీర్ హనుమంతరావుని శాలువాతో సన్మానించి, ఆత్మీయంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీరహనుమంతు రావు, మాజీ యువజన కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్ అబీద్,కాంగ్రెస్ పార్టీ నాయకులు మండే రవీందర్,యువజన కాంగ్రెస్ నాయకులు గుగులోతు కోటేష్,చేజావత్ సాయి,NSUI నాయకులు బానోత్ శ్రీధర్, హమీద్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :