Monday, 03 August 2026 10:46:14 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

చర్ల మరియు సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నమోదవుతున్న జ్వర కేసులు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (DMHO).

Date : 02 February 2026 08:31 PM Views : 149

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చర్ల మరియు సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నమోదవుతున్న జ్వర కేసుల నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (DMHO) సంబంధిత సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో జ్వర కేసుల నియంత్రణపై పలు కీలక సూచనలు జారీ చేశారు. నమోదైన ప్రతి జ్వర కేసును ప్రతిరోజూ సర్వే చేసి పర్యవేక్షించాలని ఆదేశించారు. ఐఆర్‌ఎస్ స్ప్రేయింగ్ మరియు మలాథియన్ టెక్నికల్ ఫాగింగ్‌ను నాలుగు వారాల పాటు నిర్దిష్ట వ్యవధుల్లో నిర్వహించాలని సూచించారు. రోజువారీ జ్వర సర్వేలను సమగ్రంగా పర్యవేక్షించే బాధ్యత సూపర్వైజింగ్ అధికారికి (SUO) ఉంటుందని, స్ప్రేయింగ్ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు కావాలని తెలిపారు. ప్రతి గ్రామం మరియు ఇంటింటికీ చేరుకునేలా హెల్త్ క్యాంపులు నిర్వహించాలని ఆదేశించారు.ఏ గ్రామంలోనైనా ఒక్క జ్వర కేసు గుర్తించినా, ఆ గ్రామంలో మరిన్ని కేసులు రాకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ప్రతి శుక్రవారం “డ్రై డే” కార్యక్రమాలను ఆశా కార్యకర్తలు తప్పనిసరిగా నిర్వహించి, సర్వే ఫారమ్‌ను పూర్తి చేయాలని సూచించారు.ఈ సర్వే ఫారమ్‌లో ఎన్‌సీడీ, ఈసీ, టీసీ, ఏఎన్‌సీ, పీఎన్‌సీ, ఎస్‌ఏఎం, ఎమ్‌ఏఎం, బాలల టీకాలు, విటమిన్–ఏ పంపిణీ, కుటుంబ నియంత్రణ ప్రోత్సాహం తదితర ఆరోగ్య కార్యక్రమాల వివరాలు నమోదు చేయాలని తెలిపారు.అనంతరం డీఎంహెచ్‌ఓ CHC చర్లను సందర్శించి వార్డులు, ఆపరేషన్ థియేటర్ మరియు ప్రసూతి వార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై అభిప్రాయాలు సేకరించారు.జ్వర కేసులపై సమీక్ష నిర్వహించి, అందిస్తున్న చికిత్స విధానాలపై CHC వైద్యులతో చర్చించారు. మలేరియా మందుల లభ్యతను పరిశీలించగా తగినంత నిల్వ అవసరమని గుర్తించారు.విషప్రయోగం మరియు పాము కాటు కేసుల నిర్వహణపై విచారించి, సంబంధిత అత్యవసర మందుల లభ్యతను వైద్యులతో నిర్ధారించుకున్నారు. తగినంత మలేరియా మందుల నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని మరియు దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర మలేరియా అదనపు డైరెక్టర్ గారికి లేఖ రాయాలని పోగ్రాం ఆఫీసర్ (మలేరియా)కు ఆదేశించారు.అలాగే డీఎంహెచ్‌ఓ, పిహెచ్‌సీ జూలూరుపాడు మరియు సుజాతనగర్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్పర్శ్ లెప్రసీ అవగాహన కార్యక్రమాల భాగంగా సుజాతనగర్ పాఠశాలలో విద్యార్థులకు కుష్ఠు వ్యాధిపై అవగాహన కల్పించి, అనంతరం ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా. శ్రీధర్, పోగ్రాం ఆఫీసర్ (మలేరియా) డా. స్పందన , పిహెచ్‌సీ వైద్యాధికారులు మరియు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :