తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పీఎం విశ్వకర్మ పథకాన్ని వృత్తిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి సూచించారు. శనివారం రుద్రంపూర్ సీఈఆర్ క్లబ్లో పీఎం విశ్వకర్మ పథకంపై అవగాహన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం విశ్వకర్మ, పీఎం ఈజీపీ పథకాలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, నిరుద్యోగులకు, చేతివృత్తులు చేసుకునే వారికి ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఈ పథకాలకు దరఖాస్తు చేసే విధానం, అందించే సబ్సిడీ శాతం, అర్హత ప్రమాణాలు, అలాగే ఏ ఏ రంగాలకు చెందిన వారు అర్హులనే అంశాలపై సమగ్రంగా వివరించారు.అనంతరం ఇండియా పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) మేనేజర్ రాజేష్ మాట్లాడుతూ బ్యాంకు రుణాలపై సమగ్ర వివరాలు వెల్లడించారు. రుణం పొందేందుకు అవసరమైన అర్హతలు, దరఖాస్తు విధానం, లబ్ధిదారులు పాటించాల్సిన నిబంధనలను వివరించారు. కార్యక్రమంలో భాగంగా పీఎం విశ్వకర్మ లబ్ధిదారులకు ఐపీపీబీ ఖాతాలను ప్రారంభించి, ఆన్లైన్ మర్చంట్ స్టికర్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఫెసిలిటేషన్ ఆఫీసర్ (ఎంఎస్ఎంఈ) దినేష్ కుమార్, ర్యాంప్ ఈడీసీ మేనేజర్ వసంత తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ