Sunday, 01 March 2026 06:06:21 PM
# పీఎం విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి - జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి. # జిల్లా కేంద్ర గ్రంథాలయం నందు చదివి సింగరేణి కాలరీస్ లో assistant engineer Singareni calories గా ఉద్యోగం సంపాదించిన బానోత్ నరేష్ # శ్రీరామనవమి ఉత్సవాలకు ముందస్తుగా పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి. పదవీ విరమణ పొందిన ఎస్బి ఎస్సై సూర్యనారాయణను ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # సంత్ సేవాలాల్ జయంతి వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే రాందాస్ నాయక్ . # తెలంగాణ రాష్ట్ర పద్మశాలి ఉద్యోగుల సంఘం క్యాలెండర్–2026 ఆవిష్కరణ. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్‌గా అంకిత్ ఐఏఎస్ పదవీ బాధ్యతలు స్వీకరణ. # రూ.2 కోట్ల గంజాయి పట్టివేత. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్ గా అంకిత్. # జిల్లా కలెక్టర్ బదిలీ. # తొలి రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహణ – అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్. # జాతీయ పంచాయతీ అవార్డుల పోటీలో సీతంపేట గ్రామం ఎంపిక – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. # ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తును చేపట్టి నేరస్తులకు శిక్ష పడే విధంగా అధికారులందరూ కృషి చేయాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్. # కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ ని ఘనంగా సన్మానించిన సిపిఐ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బరిగెల భూపేష్. # డివిజన్ ప్రజల ఆదరాభిమానాలకు రుణపడి ఉంటాం.16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ # మేయర్‌ను కలిసిన ప్రకృతి ప్రేమికులు. # సీఎం కప్ విజయాలు జిల్లాకు గర్వకారణం – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. # 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. # పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు పూర్తిగా కల్పించాలి – రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణ రావు. # 28న జరుగు ఐ.ఎల్.పీ.ఏ రాష్ట్ర మహిళా సదస్సును జయప్రదం చెయండి. బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కీనేని సత్యనారాయణ.

పీఎం విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి - జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి.

Date : 28 February 2026 08:51 PM Views : 96

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పీఎం విశ్వకర్మ పథకాన్ని వృత్తిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి సూచించారు. శనివారం రుద్రంపూర్ సీఈఆర్ క్లబ్‌లో పీఎం విశ్వకర్మ పథకంపై అవగాహన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం విశ్వకర్మ, పీఎం ఈజీపీ పథకాలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, నిరుద్యోగులకు, చేతివృత్తులు చేసుకునే వారికి ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఈ పథకాలకు దరఖాస్తు చేసే విధానం, అందించే సబ్సిడీ శాతం, అర్హత ప్రమాణాలు, అలాగే ఏ ఏ రంగాలకు చెందిన వారు అర్హులనే అంశాలపై సమగ్రంగా వివరించారు.అనంతరం ఇండియా పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) మేనేజర్ రాజేష్ మాట్లాడుతూ బ్యాంకు రుణాలపై సమగ్ర వివరాలు వెల్లడించారు. రుణం పొందేందుకు అవసరమైన అర్హతలు, దరఖాస్తు విధానం, లబ్ధిదారులు పాటించాల్సిన నిబంధనలను వివరించారు. కార్యక్రమంలో భాగంగా పీఎం విశ్వకర్మ లబ్ధిదారులకు ఐపీపీబీ ఖాతాలను ప్రారంభించి, ఆన్‌లైన్ మర్చంట్ స్టికర్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఫెసిలిటేషన్ ఆఫీసర్ (ఎంఎస్‌ఎంఈ) దినేష్ కుమార్, ర్యాంప్ ఈడీసీ మేనేజర్ వసంత తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :