Sunday, 07 June 2026 09:48:18 AM
# బిజెపి పార్టీ సీనియర్ నాయకులు సొప్పరి క్రాంతి ఆధ్వర్యంలో గౌతంపూర్ లో మొక్కలు నాటడం జరిగినది. # ఈ నెల 7, 8 తేదీల్లో రెండు రోజులపాటు ఎఐటీయూసీ సెంట్రల్ కౌన్సిల్ సమావేశం. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి. # మున్సిపల్ కార్పొరేషన్‌లో సిపిఐ పక్ష బలాన్ని సమర్థవంతంగా చాటాలి.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు # నామా వినోద్‌పై దాడి చేసిన భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. # మీసేవ దరఖాస్తుల పరిశీలన పూర్తిగా ఆన్‌లైన్‌లోనే. జీపీఓలు, ఆర్‌ఐలకు అవగాహన కల్పించిన ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు. # ప్రజల ప్రాణ రక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలి. గోదావరి వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మరో రెండు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్న నేపథ్యంలో జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి. # భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప కాలనీ, రెవిన్యూ కాలనీల్లో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్. # విద్యార్థులు సాంస్కృతిక పోటీల్లో రాణించాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పెట్రోలింగ్,బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మాస్టర్ ఈ .కె ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కాకర్ల గ్రామం నందు ఉచిత హోమియో వైద్య శిబిరం. # భూభారతి, సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ పార్కులో ప్లాస్టిక్ ఏరివేత -మొక్కలు నాటిన ఎస్ జి ఎఫ్. # కొత్తగూడెం ఇల్లందు రహదారిపై స్కూటీని ఢీకొన్న లారీ. # పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ధరల పెరుగుదలపై రాజీలేని పోరాటం చేద్దాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # గోపన్నగూడెంలో మినీ మేడారం జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె. # జనగణన జాబితా వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # సమున్నత ఆశయాలతోనే భారత జాతీయ మహిళా సమాఖ్య ఆవిర్భావం. భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి. # ప్రజా సమస్యల పరిష్కార మార్గాన్ని చూపే విధంగా గ్రామ సభలు ఉండాలి. 16వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

గ్రూప్-3 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

Date : 16 November 2024 05:17 PM Views : 804

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ నెల 17 మరియు 18 తారీఖులలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఆధ్వర్యంలో జరుగునున్న గ్రూప్-3 కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను చేసినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఈ రోజు తెలియజేశారు. కొత్తగూడెంలోని 26 పరీక్ష కేంద్రాలు,పాల్వంచలోని 13 పరీక్షా కేంద్రాలు మొత్తం 39 కేంద్రాల వద్ద సుమారుగా 350 మంది పోలీసు అధికారులు మరియు సిబ్బందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు. ఈ నెల 17వ తారీఖున ఉదయం 10 గంటల నుండి 12.30 గంటల వరకు మరియు మధ్యాహ్నం 3 గంటల నుండి 5.30 గంటలకు పరీక్ష జరగనుంది.మరలా సోమవారం 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి 12.30 గంటల వరకు పరీక్షా సమయాన్ని నిర్ణయించారు.జిల్లా వ్యాప్తంగా 13,478 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ అభ్యర్థులకు పలు సూచనలు చేశారు.

పరీక్ష రాయడానికి పరీక్షా కేంద్రానికి వచ్చే అభ్యర్థులు ఉదయం 9.30 గంటలు లోపు, మధ్యాహ్నం అయితే 14.30 గంటల లోపు హాజరుకావాలి. తెలుపబడిన సమయాలకు పరీక్షా కేంద్రాల మెయిన్ గేట్లను మూసివేయడం జరుగుతుంది. అభ్యర్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి తీసుకుని రాకూడదు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ పోలీస్ శాఖ పనిచేస్తుందని తెలిపారు. మంటను ప్రేరేపించే వస్తువులను గాని,ఇంకు బాటిల్స్ మరియు అనుమతి లేని యే ఇతర వస్తువులను తమ వెంట తీసుకురాకూడదు. మాల్ ప్రాక్టీస్ నకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారి నియమ నిబంధనల ప్రకారం అభ్యర్థులు నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రూప్-3 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఎటువంటి అపోహలకు,ఆందోళనకు గురికాకుండా పరీక్షకు హాజరుకావాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గ్రూప్ -3 పరీక్షా కేంద్రాల వద్ద విధులకు హాజరయ్యే అధికారులు మరియు సిబ్బందికి కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ మరియు ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ లు సమావేశం ఏర్పాటు చేసి బ్రీఫింగ్ చేయడం జరిగింది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :